Skip to main content

విజ్ఞాన్‌ ప్రవేశపరీక్ష వీశాట్‌–2023 ఫేజ్‌–1 ఫలితాలు విడుదల

విజ్ఞాన్‌ ప్రవేశపరీక్ష వీశాట్‌–2023 ఫేజ్‌–1 ఫలితాలు విడుదల
  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌

  మే 3 నుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్‌  ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్‌–2023 ఫేజ్‌–1 (విజ్ఞాన్‌ స్కోలాస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌)కు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. వీశాట్‌–2023 ఫేజ్‌–1 ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ వీశాట్‌–2023 ఫేజ్‌–1 ప్రవేశ పరీక్షను ఈ సంవత్సరం ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ ద్వారానే నిర్వహించామన్నారు. ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వీశాట్‌కు హాజరైనట్లు చెప్పారు. 90 శాతానికిపైగా విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం, పరిశోధనల్లో సత్తా చాటుతుండటంలాంటì అరుదైన విజయాంశాల వల్లనే విద్యార్థులు, తల్లిదండ్రులకు తమ యూనివర్సిటీపై ఆదరణ మరింత పెరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. వీశాట్‌–2023 ర్యాంకులతో పాటు జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు, ఎంసెట్‌ ర్యాంకులు, ఇంటర్మీడియట్‌ మార్కులను కూడా పరిగణలోనికి తీసుకుంటామని పేర్కొన్నారు. వీశాట్‌లో 1 నుంచి 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి 75% స్కాలర్‌షిప్, 51 నుంచి 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 50% స్కాలర్‌షిప్, 101 నుంచి 400లోపు ర్యాంకులు సాధించిన వారికి 25% స్కాలర్‌షిప్, 401 నుంచి 2000లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 10% స్కాలర్‌షిప్‌ను నాలుగు సంవత్సరాల పాటు అందజేస్తామని వెల్లడించారు.

ఇంటర్‌లో 970కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 50% స్కాలర్‌షిప్, 950 నుంచి 969 మార్కులు సాధించిన విద్యార్థులకు 25% స్కాలర్‌షిప్స్, 920 నుంచి 949 మార్కులు సాధించిన విద్యార్థులకు 10% స్కాలర్‌షిప్‌ అందజేస్తామని తెలియజేసారు.

జేఈఈ మెయిన్స్‌లో 95కి పైగా పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులకు 75% స్కాలర్‌షిప్, 89 నుంచి 94.9 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులకు 50% స్కాలర్‌షిప్, 81 నుంచి 88.9% పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులకు 25% స్కాలర్‌షిప్, 75 నుంచి 80.9 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులకు 10% స్కాలర్‌షిప్‌ అందజేస్తామన్నారు.

ఈ నెల 3వ తారీఖు నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్‌ సైన్స్‌ ప్రవేశాల కౌన్సిలింగ్‌ను ప్రారంభిస్తున్నామని తెలియజేసారు. వీశాట్‌ ఫేజ్‌–2 ప్రవేశ పరీక్షలను మే 5 నుంచి 31వ తారీఖు వరకు నిర్వహించనున్నామని వెల్లడించారు. 

తొలి పది ర్యాంకులు వీరికే...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ వీశాట్‌లో తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. వీశాట్‌–2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ https://www.vignan.ac.in/vsatresult/   కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే విద్యార్థుల సెల్‌ఫోన్లకు ర్యాంకులు వివరాలను పంపిస్తామని తెలియజేసారు. వివరాలకు 79819 89595 లో సంప్రదించవచ్చునని వివరించారు. 

1.యల్లంపల్లి వేణిశ్రీ  ( క్రిష్ణా జిల్లా)
2. కోమట్ల తేజశ్రీ సాయి (క్రిష్ణా జిల్లా)
3. అనపర్తి వెంకట సుబ్రహ్మణ్య మనోజ్‌ (తూర్పు గోదావరి)
4. టీవీఎస్‌ సాయి గౌతమ్‌ (తూర్పు గోదావరి )
5. గరుగు వీర వెంకట సంజన  ( బీదర్‌ , కర్ణాటక)
6. పగడాల ఎన్‌వీఎస్‌ భావన ( గుంటూరు )
7. బిజ్జం లక్ష్మి కాంత్‌ రెడ్డి (నంద్యాల )
8. భీమిరెడ్డి శివ శరణ్య ( తూర్పు గోదావరి)
9. లంక రాకేష్‌ వెంకటసాయి ( పశ్చిమ గోదావరి )
10. పొన్నమంద మనోజ్‌ కుమార్‌ ( పశ్చిమ గోదావరి)

ప్రపంచస్థాయి వసతులు
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీన్‌ ప్రమోషన్స్, కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ అఫైర్స్‌ డాక్టర్‌ డీ.విజయరాము మాట్లాడుతూ తమ యూనివర్సిటీ విద్యార్థులను ప్రపంచస్థాయి నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టీసీఎస్‌లతో తమకు అంశాల వారీగా  ప్రత్యేక అవగాహన ఒప్పందాలు ఉన్నాయన్నారు. అంతర్జాతీయ యూనివర్సిటీలతో పరస్పర ఒప్పందాలు ఉండటం వల్ల తమ విద్యార్థులను అంతర్జాతీయ పోటీకి ధీటుగా తయారుచేస్తున్నామని తెలిపారు.  అందుకే తమ విద్యార్థులు అంతర్జాతీయ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.

ఫోటోరైటప్‌ : వీశాట్‌–2023 ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్న అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (మీడియా) ఏ.గౌరీశంకర్‌రావు, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్, డీన్‌ ప్రమోషన్స్, కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ అఫైర్స్‌ డాక్టర్‌ డీ.విజయరాము ( ఎడమ నుంచి కుడి వైపుకు)

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...