దశాబ్ది ఉత్సవాలలో సన్మానం పొందిన తొలి మహిళను కావడం అదృష్టం - నాటక, టీవీ, సినీ నటి డా.శ్రీజ సాదినేని కళారంగంలో కొనసాగడం పూర్వజన్మ సుకృతం అందుకే అంతమంది ప్రముఖుల ఆశీర్వాదం అందుకునే అదృష్టం దక్కింది అన్నారు డా. శ్రీజ సాదినేని. రవీంద్ర భారతి మెయిన్ హాల్ లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రముఖ రంగస్థల,సినీ,టీవీ నటి, రచయిత్రి, దర్శకురాలు డా.శ్రీజ సాదినేనిని యఫ్ డి సి చైర్మన్ శ్రీ అనిల్ కూర్మాచలం గారు, యం.డి. శ్రీ అశోక్ రెడ్డి గారు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. రవీంద్రభారతిలో ఒక్కసారైనా తమ ప్రతిభను ప్రదర్శించాలని ప్రతి కళాకారులూ కోరుకుంటారు. తాను కూడా అలాంటి స్థితిలోనే కళారంగంలో ప్రయాణం ప్రారంభించి ఇదే రవీంద్ర భారతిలో ఎన్నోసార్లు ప్రదర్శనలు ఇవ్వడమే కాక ఎన్నోసార్లు ఇదే వేదికపై అవార్డులు, సన్మానాలు, సత్కారాలతో పాటు తమ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా ఇదే రవీంద్ర భారతిలో అందుకోవడం, అలాగే ఈరోజు ఇంత ఘనమైన సన్మానం అందుకోవడం తన అదృష్టం అని శ్రీజ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ...