Skip to main content

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన ఎన్‌సీసీ క్యాంపు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన ఎన్‌సీసీ క్యాంపు
  ఐదు రాష్ట్రాల నుంచి 600  మంది ఎన్‌సీసీ క్యాడెట్లు హాజరు

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఐదు రాష్ట్రాల నుంచి ఏక్‌ భారత్‌.. శ్రేష్ట భారత్‌ ఎన్‌సీసీ శిబిరం నిర్వహణలో భాగంగా 600 మంది ఎన్‌సీసీ క్యాడెట్‌ విద్యార్థులకు ఏర్పాటు చేసిన శిక్షిణా శిబిరం ఆదివారం ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌ల నుంచి హాజరైన ఎన్‌సీసీ విద్యార్థులకు 12 రోజుల పాటు సాంస్కృతిక శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్, క్యాంపు కమాండర్‌ కల్నల్‌ ఎస్‌ఎమ్‌. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఏక్‌ భారత్‌.. శ్రేష్ట భారత్‌లో భాగంగా నిర్వహించిన శిక్షణా శిబిరంలో విద్యార్థులు వారి రాష్ట్రాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వివిధ ప్రదర్శనల ద్వారా తెలియజేయడమే ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 12 రోజుల క్యాంపులో భాగంగా విద్యార్థులతో కొండవీడు కోటకు వెల్లి ట్రెజర్‌ హంట్‌ కండక్ట్‌ చేశామన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి, ఉండవల్లి గుహలు, అమరావతి బుద్ధ విగ్రహం, మ్యూజియం, సూర్యలంక ఏయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లను సందర్శించామన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఎన్‌సీసీ వలన విద్యార్థులకు క్రమశిక్షణ, సమయపాలన, సానుకూల దృక్పథం, సమాజంలో ఇతరులతో ఎలా మెలగాలో నేర్చుకుంటారని తెలియజేసారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ మాట్లాడుతూ  ఎన్‌సీసీ వలన క్రమశిక్షణతో పాటు, కలిసి మెలిసి ఉండటం, ప్రజలకు సామాజిక సేవ చేసే అవకాశం దొరుకుతుందన్నారు. విద్యార్థులందరూ ఎన్‌సీసీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. శిక్షణా శిబిరాన్ని పురస్కరించుకుని గ్రూప్‌ సాంగ్స్, డిబేట్స్, గ్రూప్‌ డాన్స్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, టగ్‌ ఆఫ్‌ వార్, ఎన్‌సీసీ సాంగ్‌ కాంపిటీషన్‌లో నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు మెడల్స్‌తో పాటు ప్రశంసా పత్రాలను అందజేసారు. కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్,  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్, క్యాంపు కమాండర్‌ కల్నల్‌ ఎస్‌ఎమ్‌. చంద్రశేఖర్, గుంటూరులోని 25ఏ బెటాలియన్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ సీఎస్‌ సిద్ధు ఆయా విభాగాల డీన్లు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...