Skip to main content

భవిష్యత్‌ కాలమంతా కృతిమ మేథదే

భవిష్యత్‌ కాలమంతా కృతిమ మేథదే!

  ఐఎస్‌ఐ కోలకత్తలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ప్యాట్రన్‌ రికగ్నిషన్‌ యూనిట్‌ ప్రొఫెసర్‌ ఉమపాద పాల్‌


  విజ్ఞాన్స్‌లో ఘనంగా ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

రాబోయే భవిష్యత్‌ కాలమంతా కృతిమ మేథ మీదే ఆధారపడి ఉంటుందని ఐఎస్‌ఐ కోలకత్తలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ప్యాట్రన్‌ రికగ్నిషన్‌ యూనిట్‌ ప్రొఫెసర్‌ ఉమపాద పాల్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘అప్లికేషన్స్‌ అండ్‌ అల్గారిథమ్స్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ విజన్‌ అండ్‌ ప్యాట్రన్‌ రికగ్నిషన్‌ ’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎస్‌ఐ కోలకత్తలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ప్యాట్రన్‌ రికగ్నిషన్‌ యూనిట్‌ ప్రొఫెసర్‌ ఉమపాద పాల్‌ మాట్లాడుతూ మెరుపు వేగంతో ముందుకొస్తున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. నేర్చుకునే యంత్రాలు, నాడీ అనుసంధాన వ్యవస్థలు, సహజ భాషల విభజన, జన్యు అల్గారిథమ్‌లు, కంప్యుటేషన్‌ సృజనాత్మకత... ఇలా సాధారణ స్థాయి నుంచి స్వీయ అవగాహన యంత్రాల వరకు కృత్రిమ మేధస్సు నిత్యనూతనంగా మారుతూ వస్తుందన్నారు. టాకింగ్‌ బోట్, చాట్‌బోట్, ఇమేజ్, ఫేస్‌ అండ్‌ ఎమోషన్‌ రికగ్నిషన్, ఏఐ ఆధారిత గేమ్స్‌కు సంబంధించిన కోడింగ్‌ నైపుణ్యాలు, వాటి తయారీ విధానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో రోబోటిక్స్‌ సేవలు అత్యంత కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. అగ్రికల్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, లా అండ్‌ ఆర్డర్, షిప్పింగ్, స్పేస్‌ రీసెర్చ్‌ టెస్టింగ్‌లో రోబోటిక్స్‌ వినియోగం రోజురోజుకు పెరుగుతోందన్నారు. జనరల్‌ మోటార్స్‌ తదితర కంపెనీలు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల తయారీలను ప్రారంభించాయన్నారు. కృత్రిమ మేథ, ఆటోమేషన్‌ వంటి టెక్నాలజీ ప్రవేశంతో ఉద్యోగాల తీరు మారడంతో పాటు అనేక సవాళ్లు సైతం ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...