Skip to main content

ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ప్రమాణాలు తప్పక పాటించాలి

ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ప్రమాణాలు తప్పక పాటించాలి

  ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, సీఈఐజీ జీ.విజయలక్ష్మి

వినియోగదారులందరూ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ప్రమాణాలు తప్పక పాటించాలని ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, సీఈఐజీ జీ.విజయలక్ష్మి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ విభాగంలోని ఎలక్ట్రికల్‌ మెయింటనెన్స్‌  ఆధ్వర్యంలో ‘‘ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ’’ అనే అంశంపై శుక్రవారం ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, సీఈఐజీ జీ.విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రయాణించే వాహనాలపై ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు జారిపడినా లేదా వాటికి మనం ప్రయాణించే వాహనం తగిలినట్లైతే వాహనంలో నుంచి బయటపడేందుకు హాపింగ్‌ (గెంతడం లేదా దూకటం) విధానాన్ని అనుసరించాలన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి మోటారు స్టార్టర్లు స్విచ్చులు ఉన్న ఇనుప బోర్డులను విధిగా ఎర్తింగ్‌ చేయాలని పేర్కొన్నారు. మోటార్లు తిరగని ఎడల విద్యుత్‌ స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మత్తు నిమిత్తమై రైతులు ఎక్కరాదన్నారు. పొలాల్లో తెగిపడిన, జారిపడి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ వైర్లకు దూరంగా ఉండి సంబంధిత విద్యుత్‌ సిబ్బందికి గానీ, గ్రామ సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ సహాయకులకు గానీ ఫిర్యాదు చేయాలని తెలియజేసారు. ఇంట్లోగానీ, వాణిజ్య సంస్థల్లోగానీ లూజ్‌ ఎర్త్‌ కనెక్షన్లు, లూజ్‌ వైరింగ్‌ లేకుండా పర్మినెంటుగా ఉండేటట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇండస్ట్రీ పరిసరాలలో తాత్కాలిక వైరింగ్‌ కాకుండా శాశ్వతమైన పీవీసీ పైపుల ద్వారా ఏర్పాటు చేయించే బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, టెక్నికల్, డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ వీ.జయబాబు, ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్‌ గుంటూరు డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పీ.బాలక్రిష్ణ, విజ్ఞాన్స్‌ వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక, ఎలక్ట్రికల్‌ మెయింటనెన్స్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...