విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ కన్వెన్షనల్ ఇంజినీరింగ్ విభాగంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన వెన్నం స్వాతి అనే విద్యార్థినికి తమ యూనివర్సటీ పీహెచ్డీ పట్టా అందించిందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘యాన్ ఎక్సిపెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ ఆన్ పెర్ఫార్మెన్స్ ఆప్ హై–వాల్యూమ్ ఫ్లై యాష్ విత్ హైబ్రిడ్ ఫైబర్ బేస్డ్ కాంక్రీట్’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేసిందని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలోని ప్రొఫెసర్ ఏ.శివశంకర్ గైడ్గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 4 స్కూపస్ పేపర్లు పబ్లిష్ చేశారని తెలియజేసారు. డాక్టరేట్ పొందిన వెన్నం స్వాతిని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.