విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కన్వెన్షనల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ముక్కాల ప్రియాంక అనే విద్యార్థినికి తమ యూనివర్సటీ   పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం  తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎక్సిపెరిమెంటల్‌ ఇన్విస్టిగేషన్‌ ఆన్‌ స్ట్రెంగ్త్, డూరబిలిటీ అండ్‌ మైక్రోస్ట్రక్చరల్‌ కారక్టరిస్టిక్స్‌ ఆఫ్‌ జియోపాలిమర్‌ అగ్రిగేట్‌ బేస్డ్‌ కాంక్రీట్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేసిందని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ కార్తికేయన్‌ మునిరాజు గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 4 స్కూపస్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన ముక్కాల ప్రియాంకను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.