Skip to main content

Posts

Showing posts from September, 2023

ఫార్మసీ విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి

ఫార్మసీ విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి   గుంటూరులోని డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దోనవల్లి లక్ష్మణ్‌   విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల వైపు ఆసక్తి పెంచుకోవాలని, అప్పుడే దేశానికి ఉపయోగపడే విధంగా కొత్త మందుల ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని గుంటూరులోని డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దోనవల్లి లక్ష్మణ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రాక్టీస్, సూట్స్‌ కేర్‌ నెట్‌వర్క్‌ల సంయుక్త ఆధ్వర్యంలో  ‘‘ప్రివెంటెవ్‌ అండ్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ సైన్సెస్‌’’ అనే అంశంపై  రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్‌ను ‘‘ఏ పారాడిమ్‌ షిఫ్ట్‌ ఆఫ్‌ క్లినికల్‌ ప్రాక్టీస్‌ ఫ్రమ్‌ హాస్పిటల్‌ టు కమ్యూనిటీ ఎట్‌ లార్జ్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరులోని డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్...

విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా

విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు  అటానమస్‌ ( స్వయం ప్రతిపత్తి) హోదా కల్పిస్తున్నట్లు న్యూఢిల్లీలోని యూజీసీ ( యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌) ఉపకార్యదర్శి గోపీచంద్‌ మేరుగు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా లభించండం వలన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కోర్సులను, సొంత పాఠ్యప్రణాళిక ఏర్పాటు చేసుకోవడంతో పాటు పరీక్షల నిర్వహణ, మూల్యాకంనం, డిగ్రీలను ప్రదానం చేయవచ్చన్నారు. ఈ అటానమస్‌ హోదా 2023–24 అకడమిక్‌ విద్యా సంవత్సరం నుంచి 2032–33 (10 సంవత్సరాల) పాటు లభించిందని పేర్కొన్నారు. ఈ హోదాతో బహుళజాతి కంపెనీలు విస్తృతంగా క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. అంతేకాకుండా విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు మెరుగైన విద్యాబోధనకు కృషి చేసే అవకాశం ఉంటుందని తె...

విజ్ఞాన్స్‌ వర్సిటీకు క్యూఎస్‌ ఐ–గేజ్‌ డైమండ్‌ రేటింగ్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీకు క్యూఎస్‌ ఐ–గేజ్‌ డైమండ్‌ రేటింగ్‌ – ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ లండన్‌లోని క్యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ప్రతిష్టాత్మకంగా ప్రకటించే క్యూఎస్‌ ఐ–గేజ్‌ ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌లో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు డైమండ్‌ రేటింగ్‌ – ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ లభించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ధృవపత్రాన్ని చెన్నైలోని ట్రిడెంట్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో డైమండ్‌ రేటింగ్‌ – ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ సర్టిఫికెట్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ చేతుల మీదుగా  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ మంగళవారం అందుకున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌  మాట్లాడుతూ యూనివర్సిటీకు క్యూఎస్‌ ఐ–గేజ్‌ ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ను  ఇవ్వాలంటే ప్రధానంగా 9 అంశాలను పరిగణలోనికి తీసుకుంటారన్నారు. వాటిలో టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్, ఫ్యాకల్టీ క్వాలిటీ, ఎంప్లాయబిలిటీ, డైవర్సిటీ అండ్‌ యాక్సిసిబిలిటీ, ఫెసిలిటీస్, సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, గవర్నెన్స్‌ అండ్‌...

బాలల హక్కులకు భంగం కల్పిస్తే చర్యలు

బాలల హక్కులకు భంగం కల్పిస్తే చర్యలు   గుంటూరులోని పోస్కో కోర్ట్‌ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రోసిక్యూటర్‌ కారుమంచి శ్యామల   విజ్ఞాన్స్‌లో ఘనంగా ముగిసిన అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ బాలల హక్కులకు భంగం కల్పిస్తే చర్యలు తప్పవని గుంటూరులోని పోస్కో కోర్ట్‌ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రోసిక్యూటర్‌ కారుమంచి శ్యామల అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌: సమస్యలు – సవాళ్లు ’’ అనే అంశంపై మొట్ట మొదటి  అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  గుంటూరులోని పోస్కో కోర్ట్‌ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రోసిక్యూటర్‌ కారుమంచి శ్యామల మాట్లాడుతూ బాలల హక్కులైన విద్యాహక్కు చట్టం, జీవించే హక్కు గురించి బాలలకు  ఉండే ఇతర చట్టాల గురించి, పోలీసులు బాలలకు కల్పించే రక్షణ, మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి, పోక్సో చట్టం గురించి, చట్టంతో విభేదించిన బాలురకు ప్రత్యేక బాలల కోర్టులు, రక్షణ కేంద్రం గురించి విద్యార్థులకు వివరించారు...

బస్వరాజ్ కు ' విశ్వగురు వరల్డ్ రికార్డ్స్'లో చోటు

బస్వరాజ్ కు ' విశ్వగురు వరల్డ్ రికార్డ్స్'లో చోటు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  పర్యావరణ హిత కళాఖండాల సృష్టికర్త కాప్రాకు చెందిన  బస్వరాజ్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ పురస్కారం అందుకున్నారు. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన బస్వరాజ్ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు . తాను రూపొందించిన కళాఖండాలు , విగ్రహాలతో ఆయన ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు . చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయన 51 కిలోల పసుపుతో అయిదున్నర అడుగుల హరిద్రా వినాయక విగ్రహాన్ని రూపొందించారు . విశ్వగురు సంస్థ ప్రతినిధులు  బుధవారం మండపానికి విచ్చేసి హోతి బస్వరాజ్ కు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ధ్రువపత్రం అందజేశారు .

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తాచాటిన విజ్ఞాన్స్‌ విద్యార్థులు

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తాచాటిన విజ్ఞాన్స్‌ విద్యార్థులు చేబ్రోలు, సెప్టెంబర్‌ 21 టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ : చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తాచాటారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని రేపల్లెలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ 3వ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తమ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు 5 గోల్డ్‌ మెడల్స్, 8 సిల్వర్‌ మెడల్స్, 6 బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారని పేర్కొన్నారు. గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన విద్యార్థులు వచ్చే నెల అక్టోబర్‌ మొదటి వారంలో ఉత్తరప్రదేశ్‌లోని నాసిక్‌లో జరగబోయే జాతీయస్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించారని వెల్లడించారు. అదే విధంగా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బాపట్ల జిల్లా నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన చాంపియన్‌షిప్‌లో రిథమిక్‌ యోగా పేయిర్, ఆర్టిస్టిక్‌ యోగ సోలో, ఆర్టిస్టిక్‌ యోగా పేయిర్‌ వంటి విభాగాల్లో తమ విద్యార్థులు...

ఒబిసి కోటా.. శివశంకర్ పాత్ర

ఒబిసి కోటా.. శివశంకర్ పాత్ర                           -కె. ఎస్‌. ఎన్. ప్రసాద్                              94925 22089 ఈ దేశ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇప్పుడు అమలవుతున్న ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్‌లు ఎవరి పుణ్యం. అని ప్రశ్నించుకుంటే చాలా విస్మయం కలిగించే సమాధానాలు లభిస్తాయి. ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్స్ కల్పించటమేకాక వాటిని రాజ్యాంగబద్ధ్దం చేసింది మాత్రం అంబేద్కర్. మరి విద్య, ఉద్యోగ రంగాల్లో బిసిలకు రిజర్వేషన్స్ కల్పించింది ఎవరు? ఇందులో అంబేద్కర్ గారి పాత్ర ఎంత? అని ప్రశ్నించుకుంటే సాంకేతికంగా లేదనే జవాబే వస్తుంది. ఈ రిజర్వేషన్స్ స్ఫూర్తి ఆయనది కావచ్చు కానీ వాటికోసం పోరాడింది పుంజాల శివశంకర్, కొండా లక్ష్మణ్, బొజ్జం నర్సింహులు,గౌతు లచ్చన్న. వీరిలో మడమ తిప్పకుండా తుదివరకు తెగించి పోరాడి సాధించింది మాత్రం పి.శివశంకరే. వెనుకబడిన తరగతులకు ప్రయోజనాల గురించి ఆలోచించటంలో తనతో భావసారూప్యత కలిగిన కొందరు మిత్రులతో కలిసి ఒకనాటి హైదరాబాద్...

అక్కినేని చిరస్మరణీయులు

  అక్కినేని  చిరస్మరణీయులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, తెనాలి: సినీరంగంలో ఎవర్గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు చిరస్మం గణీయులని శారదా నికేతన్ నిర్వాహకులు శారదా చలపతి అన్నారు . స్థానిక గాంధీనగర్ లోని బొల్లిముంత ఫౌడేషన్ హాల్లో అభ్యుదయ కళాసమితి , తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అక్కనేని నాగేశ్వరరావు శతజయంతి నిర్వహించారు . ఈ సందర్భంగా తొలుత అక్కినేని చిత్రపటానికి నివాళులర్పించారు . శారత చలపతి మాట్లాడుతూ 93 ఏళ్ళ వయసు వరకూ అక్కినేని సినిమాల్లో నటన ప్రశంసనీయమన్నారు . ఇస్కస్ జిల్లా నాయకులు శ్రీదేవి మాట్లాడుతూ అక్కినేని నాటక రంగం నుంచి సినీరంగంలోకి అడుగు పెట్టారని , తన తననతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు . కార్యక్రమంలో బొల్లిముంత కృష్ణ , టి . జగన్మోహనరావు , పలువురు కళాకారులు , సాహితీ ప్రియులు పాల్గొన్నారు . స్వరలయ ఆధ్వర్యంలో అక్కినేనికి నివాళి చలనచిత్ర రంగంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చెరగని ముద్ర వేశారని స్వరలయ వేదిక అధ్యక్షులు లక్కరాజు సాయి అన్నారు . స్థానిక మారిసు పేటలోని స్వరలయ వేదిక కార్యాలయంలో అక్కినేని శతజయంత్యోత్సవం ని...

ఆక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారు

ఆక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారు - మాజీ ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు  శత జయంతి వేడుకలు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌ లో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: నటసామ్రాట్  అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా  బుధవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు  విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో సినీ ప్రముఖులు మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్‌చరణ్‌, మోహన్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, ఎం.ఎం. కీరవాణీ , నాని, మంచు విష్ణు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్,  శ్రీకాంత్‌, జయసుధ, బ్రహ్మానందం, అల్లు అరవింద్‌, అశ్వినీదత్, దిల్‌ రాజు, మురళీమోహన్‌, సుబ్బరామిరెడ్డి, సి కళ్యాణ్...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డీ. యాకోబుకు తమ యూనివర్సటీ సీఎస్‌ఈ విభాగంలో బుధవారం పీహెచ్‌డీ పట్టా అందించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘యాన్‌ ఎఫిసియంట్‌ క్రిప్టో–స్కీమ్‌ ఫర్‌ ప్రైవసీ ప్రిసర్వేషన్‌ ఆఫ్‌ అన్‌స్ట్రక్చర్డ్‌ టెక్ట్స్‌ అండ్‌ స్ట్రక్చర్డ్‌ డేటా ఇన్‌ పబ్లిక్‌ క్లౌడ్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని అడ్వాన్డ్స్‌ సీఎస్‌ఈ విభాగాధిపతి ప్రొఫెసర్‌ దొండేటి వెంకటేషులు గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 3 స్కూపస్‌ ఇండెక్డ్స్‌ జర్నల్స్, 3 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. పీహెచ్‌డీ పట్టా పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డీ.యాకోబును వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించా...

అక్కినేనినాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా

అక్కినేనినాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా *_పాత్రకు ప్రాణం పోస్తే_* *_అది అక్కినేని..!_* +++++++++++++++++ చిత్రకారుడు: ఎం. వెంకట్ *_ఎప్పటి సీతారామజననం_* *_ఎక్కడ మనం.._* ఈ రెంటి మధ్యనే  *తెలుగు సినిమా గమనం..* మూకీలు ముగిసి టాకీలు మొదలైన టాలీవుడ్ లో *అక్కినేని ప్రవేశం* *ఓ చారిత్రక సన్నివేశం..!* తొలినాళ్ళలో ఆయనకు పరిశ్రమ చిరునామా తర్వాత ఆయనే అయ్యారు *పరి"శ్రమ"కు చిరునామా..* కళాఖండాలకు వీలునామా..! ఆరడుగుల ఎన్టీఆర్ కు  పోటీ అయ్యాడు  ఈ నటనలో మేటి ఇద్దరూ ఎవరికి వారే సాటి.. నందమూరి పౌరాణికుడైతే అక్కినేని నటనకు *_ప్రామాణికుడయ్యాడు.._* ఆయన రాముని మించిన  రాముడనిపించుకుంటే ఈయన రాముడు  కాదు కృష్ణుడు.. తాండవకృష్ణుడు..! రెండు సినిమాల్లో  రామారావు కృష్ణుడై  ఒకేలాంటి నటనను ప్రదర్శిస్తే *మాయాబజార్లో* అభిమన్యుడిగా *కృష్ణార్జునయుద్ధం* లో కిరీటిగా విభిన్న ప్రదర్శన అక్కినేనిది.. పాత్ర ఏదైనా ఆయన *_అభినయం తిరుగులేనిది!_* తొలితరం *రొమాంటిక్ హీరో* *నవలానాయకుడు..* *_భగ్నప్రేమికుడు.._* భక్తి లేకపోయినా  తెరపై మహాభక్తుడు.. మందుకొట్టని  తాగుబోతు ...

విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు

విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్‌డే వేడుకలను వైభవంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునే దిశగా సాగాలని, వైఫల్యాలను సైతం విజయానికి సోపానంగా మార్చుకోవాలని సూచించారు. సాహసాలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. అప్పుడే గొప్ప విజయాలు సిద్ధిస్తాయన్నారు. విజయం అంటే కేవలం వ్యక్తిగతమే కాదు. సమాజంలోని పక్కవారిని ఉద్దరించడమే నిజమైన విజయమన్నారు. జిజ్ఞాస, సమర్ధ సమయ పాలన, బుద్ధి స్థిరత్వం, వేగంగా సంగ్రహించుకోగలగడం... ఇలా ఎన్నో అంశాలు మీ విజయాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. విద్యార్థులు వారి ఆలోచనలు, జ్ఞానాన్ని సహచర విద్యార్థులతో పంచుకుంటే అంతకుమించిన గొప్ప అధ్యయనం మరోటి ఉండదని పేర్కొన్నారు. విద్యార్థులు పెద్ద పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని అందుకునేందుకు పరుగిడాలని పిలుపునిచ్చారు. ఫ్రెషర్స్‌ డే సందర్భంగా మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రదర్శ...

ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ క్రియేటర్సే

ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ క్రియేటర్సే !   బెంగళూరులోని యూఆర్‌ రావ్‌ సాటిలైట్‌ సెంటర్, ఇస్రో ఆర్‌ అండ్‌ క్యూఏ మెకానికల్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టింగ్‌ హెడ్‌ మహేందర్‌ పాల్‌ సింగ్‌   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇంజినీర్స్‌ డే వేడుకలు ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ క్రియేటర్సేనని బెంగళూరులోని యూఆర్‌ రావ్‌ సాటిలైట్‌ సెంటర్, ఇస్రో ఆర్‌ అండ్‌ క్యూఏ మెకానికల్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టింగ్‌ హెడ్‌ మహేందర్‌ పాల్‌ సింగ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం ప్రఖ్యాత ఇంజినీరు, భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెంగళూరులోని యూఆర్‌ రావ్‌ సాటిలైట్‌ సెంటర్, ఇస్రో ఆర్‌ అండ్‌ క్యూఏ మెకానికల్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టింగ్‌ హెడ్‌ మహేందర్‌ పాల్‌ సింగ్‌ మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదవకుండా ఇష్టంతో ప్రయోగాలు చేయడం వలన సమాజంలో ఉన్న  సమస్యలకు ఇంజినీరింగ్‌ రంగం ద్వారా పరిష్కారం వెతికి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చన్నారు...

టీడీపీ - జనసేన పొత్తు ఖరారు

టీడీపీ - జనసేన పొత్తు ఖరారు   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం , జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు . ' చంద్రబాబుతో ములాఖత్ రాష్ట్రానికి చాలా కీలకమైంది. 2024 లో ఈ అరాచక పాలన నుంచి బయటపడాలంటే బీజేపీ , జనసేన , టీడీపీ కలిసి వెళ్లాలని నా కోరిక. బీజేపీ దీనిపై పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా. ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు ' అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ వర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కన్వెన్షనల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆళ్ల సుశీల అనే విద్యార్థినికి తమ యూనివర్సటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘పెర్ఫార్మెన్స్‌ ఎవాల్యూషన్‌ ఆన్‌ యుటిలైజేషన్‌ ఆఫ్‌ స్నెయిల్‌ షెల్‌ పౌడర్‌ సిమెంట్‌ కాంపోసిట్‌ ఇన్‌ డిటీరియోరేటెడ్‌ స్ట్రక్చర్స్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేసిందని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని ప్రొఫెసర్‌ ఏ.శివశంకర్‌ గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 5 స్కూపస్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన ఆళ్ల సుశీలను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

జగమెరిగిన కార్టూనిస్టు జయదేవ్

జగమెరిగిన కార్టూనిస్టు జయదేవ్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: బాపు తరువాత సంతకం అక్కర్లేని అతి కొద్దిమంది వ్యంగ చిత్రకారులలో జయదేవ్ ఒకరు. చూడగానే ఇది జయదేవ్ కార్టూన్ అని తెలిసిపోతుంది. వారు వేసిన కార్టూన్లలో చక్కటి పొందిక అకట్టుకునే ఆకర్షణ. బొమ్మ చిత్రీకరణలో ఎటువంటి విపరీతాలు (మిడి గుడ్లు, అసహజ రూపాలు వంటివి) ఉండవు. సహజత్వానికి దగ్గరగా కార్టూన్ల లోని అయా పాత్రల ముఖ భంగిమలు, సదర్భానికి సరిపొయే ముఖ కవళికలు హాస్యప్రధానంగా చిత్రీకరించటంలో జయదేవ్ దిట్ట. అలాగే కార్టూన్లలోని సంభాషణలు ఎంతో పొదుపుగా చక్కటి భాషలో ఉండి అరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి. బొమ్మకి వ్యాఖ్యా, లేదా వ్యాఖ్యకు బొమ్మా అని తటపటాయించేవారికి, వ్యాఖ్య లేకుంటే బొమ్మ అర్ధం కాదు. బొమ్మలేకుంటే వ్యాఖ్య అర్ధంకాదు. కార్టూన్లలో ఈ రెండిటికీ మంచి సంబంధం ఉండాలి అని వివరిస్తారు జయదేవ్ గారు...జన్మదినం సందర్భంగా వారికి హార్దిక  శుభాకాంక్షలు !    🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿 జయదేవ్ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 సెప్టెంబర్ 13న కడపలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు సజ్జా జయదేవ్ బాబు. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ...

టాలెంట్ ఎక్స్ ప్రెస్ 10వ వార్షికోత్సవ పుస్తకాన్ని ఆవిష్కరించిన కుమార్ పుంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ 10వ వార్షికోత్సవ పుస్తకాన్ని ఆవిష్కరించిన కుమార్ పుంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం తెనాలి: టాలెంట్ ఎక్స్ ప్రెస్ 10వ వార్షికోత్సవ పుస్తకాన్ని  కుమార్ పుంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మంగళవారం ఆవిష్కరించారు. కుమార్ పుంప్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ సంఘ నేత కనపర్తి రత్నాకర్ ను అభినందించారు. గత పదేళ్లుగా టాలెంట్ ఎక్స్ ప్రెస్ పత్రికద్వారా పత్రికారంగం లో అనేక సేవలు రత్నాకర్ అందించారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారాలకోసం పత్రికలు కృషి చేయాలన్నారు. ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఎన్. సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించిన కోర్ట్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. ఆయనను కాసేపట్లో రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. చంద్రబాబును నిన్న నంద్యాలలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తొలుత కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తరలించి, సుదీర్ఘ సమయం పాటు విచారించారు. వేకువ జామున వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి, అక్కడ్నించి ఏసీబీ కోర్టుకు తరలించారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మధ్యాహ్నానికి వాదనలు పూర్తికాగా, న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఈ మధ్యాహ్నం నుంచి తీర్పు కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు... తీర్పు వెల్లడిస్తున్న నేపథ్యంలో కోర్టు హాల్లోకి వెళ్లారు. కోర్టు హాల్లోకి 30 మందిని మాత్రమే అనుమతించారు. తీర్పు నేపథ్యంలో కోర్టులో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొం...

మన్నవ బాబుకు న్యాయ శాస్త్ర విభాగంలో పీహెచ్.డి డిగ్రీ

స్థానిక తెనాలి పట్టణం సమీపంలోని నందివెలుగు గ్రామానికి చెందిన మన్నవ బాబు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్ర విభాగంలో పీహెచ్.డి డిగ్రీ పట్టాను పొందినట్లుగా ఒక ప్రకటనలో తెలియజేశారు.   వీరు నందివెలుగు గ్రామంలోని మన్నవ వెంకటేశ్వర్లు, జయమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో మూడో వ్యక్తిగా ఉన్న మన్నవ బాబు 2008లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన న్యాయమూర్తుల (జడ్జిల) నియామకంలో జూనియర్ సివిల్ జడ్జిగా నియామకం అయ్యారు.  కడు పేద కుటుంబం నుంచి వచ్చిన మన్నవ బాబు, విద్య పట్ల ఎంతో ఆసక్తి కలిగి, ఒక ప్రక్క సెలవు దినాలలో పనిపాటలు చేసుకుంటూ కూలీనాలీకి వెళ్తూ, పెయింటర్ గా వ్యవసాయ కూలీగా, రకరకాల పనుల్లో తాను ఆర్థికంగా కాస్త బలాన్ని సమకూర్చుకుంటూ, ఆ వచ్చిన డబ్బుల్ని కుటుంబ పోషణకి కొంత, మరికొంత  చదువులకు వినియోగించుకుంటూ ఎదిగినటువంటి వ్యక్తి మన్నవ బాబు. వీరు 2008కి పూర్వం తెనాలిలోని ప్రముఖ న్యాయవాది ఎస్ రామారావు గారి పర్యవేక్షణలో జూనియర్ న్యాయవాదిగా  కొనసాగుతూనే, న్యాయమూర్తిగా ఎంపికకోసంజరిపే పరీక్షలకు సన్నద్దుడౌతుండేవారు.  మొదటి సారి పరీక్షలో విజయం సా...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీ సిబ్బంది, పలువురు విద్యార్థులు సామూహిక వ్రత పూజలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ అష్టలక్షు్మలలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందని, మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని, విశేష ఫలితాలు దక్కుతాయని తెలిపారు. విదేశీయులు సైతం ప్రస్తుతం మన సంప్రదాయాలను ఆచరిస్తున్నారని తెలిపారు. మన పండుగలు, వాటిని జరుపుకునే తీరు చూసి ప్రపంచం అబ్బురపడుతోందన్నారు. ఎప్పటికీ మన సంస్కృతిని యువత మరిచిపోరాదనే ఉద్దేశంతో ఇలా అన్ని పండుగలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలుత విఘ్నేశ్వర పూజ అనంతరం వరలక్ష్మీ వ్రతం కొనసాగింది. కళాశాల విద్యార్థినులు ప్రత్యేక పూజల్లో ఆసక్తిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ ర...

జన్మదినోత్సవ శుభాకాంక్షలు

జన్మదినోత్సవ శుభాకాంక్షలు

జన్మదినోత్సవ శుభాకాంక్షలు

జన్మదినోత్సవ శుభాకాంక్షలు

ఘనంగా కృష్టాష్టమి వేడుకలు

ఘనంగా కృష్టాష్టమి వేడుకల టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పట్టణంలో కృష్టాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం అన్ని ప్రధాన కృష్ణ మందిరాల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ కృష్ణుని నామస్మరణ తో మారుమ్రోగాయి.  చినరావూరు శ్రీ కృష్ణ మందిరం పరిసరాలను విద్యుత్ తోరణాలతో అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణుని ప్రతిమ, పుష్ప తోరణాలు, కుత్రిమ జలపాతం, కృష్టుని బొమ్మతో ముద్రించిన వృత్తాకారపు జెండాలు  భక్తులకు కనువిందు చేస్తున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో గురువారం ఉట్టి  కొట్టే కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. శ్రీ కృష్ణ మందిర భక్తుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వేడుకలను కొనసాగిస్తున్నారు.

విలువలు నేర్పడం ఉపాధ్యాయుడి బాధ్యత

విలువలు నేర్పడం ఉపాధ్యాయుడి బాధ్యత   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:   విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటు విలువలు కూడా నేర్పించాల్సిన బాధ్యత ఉందని విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం, విజ్ఞాన్స్‌ జూనియర్‌ కళాశాలలో మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా వారి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. విద్యార్థులతో ఉపాధ్యాయులకు మమతానుబంధం ఉండాలని తెలిపారు. ఏ రంగంలోనూ లేని, ఉపాధ్యాయులకు మాత్రమే ఉన్న అతి గొప్ప అవకాశం సాధ్యమైనంతమంది శిష్యులను పొందడమేనని వెల్లడించారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుడి చేతుల్లో ఉందని,...

విజ్ఞాన్స్‌లో వైభవంగా ఉట్టి ఉత్సవ వేడుకలు

విజ్ఞాన్స్‌లో వైభవంగా ఉట్టి ఉత్సవ వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఉట్టి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఉట్టి ఉత్సవం ఐక్యతకు, సమష్టితత్వానికి ప్రతీక అని  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉట్టి ఉత్సవంలో పాల్గొని ఉట్టిని పగులగొట్టారు. ఎంతో ఎత్తున ఉండే ఉట్టిని పగులగొట్టడం ద్వారా సమష్టి కృషితో ఏదైనా సాధించొచ్చనే విషయాన్ని తెలుపుతుందన్నారు. జీవితంలో ప్రతి విజయానికి సమష్టి కృషి ఎంతో అవసరమని వెల్లడించారు. ఇప్పటి నుంచే విద్యార్థులు నలుగురితో కలిసి మెలిసి పనిచేయడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి ఉత్సవం ఆద్యంతం ఉల్లాసాన్ని నింపింది. దాదాపు 50 జట్లు ఈ ఉట్టి ఉత్సవంలో పాల్గొన్నాయి. ఒక్కో జట్టులో 12 మంది చొప్పున ప్రాతినిధ్యం వహించి ఉట్టిని కొట్టే వేడుకల్లో పాలుపంచుకున్నారు. 12 మంది పిరమిడ్‌లా ఏర్పడి ఉట్టిని పగులగొట్టిన వ...

సురేంద్ర రొడ్డకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

సురేంద్ర రొడ్డకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వడమాలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  సాంఘిక శాస్త్ర పనిచేస్తున్న సురేంద్ర రొడ్డకు ఉపాధ్యాయ పురస్కారం విద్యా పరిరక్షణ సమితి అధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో సన్మానిస్తున్నట్లు వ్యవస్థాపకులు డాక్టర్ భాస్కర్ వేడియం తెలిపారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.9.15 కోట్ల ఎన్‌టీటీఎమ్‌ ప్రాజెక్ట్‌ ఫండ్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.9.15 కోట్ల ఎన్‌టీటీఎమ్‌ ప్రాజెక్ట్‌ ఫండ్‌ ప్రాజెక్ట్‌ ఫండ్‌కు కృషి చేసిన అధ్యాపక సిబ్బందిని అభినందిస్తున్న వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ వర్సిటీకు భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ నుంచి రూ.9.15 కోట్ల ఎన్‌టీటీఎమ్‌ (నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌) ప్రాజెక్ట్‌ ఫండ్‌ లభించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఎన్‌టీటీఎమ్‌ నుంచి ప్రాజెక్ట్‌ ఫండ్‌ పొందినది ఒక్క విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ మాత్రమేనని తెలియజేసారు. ఈ ప్రాజెక్ట్‌ ఫండ్‌ ద్వారా టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌లో ఔత్సాహిక ఇన్నోవేటర్స్‌ను, పరిశోధనలను, స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అంతేకాకుండా ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, 3డీ–4డీ ప్రింటింగ్, రాపిడ్‌ ప్రోటోటైపింగ్‌ ఉపయోగించి స్మార్ట్‌ టెక్స్‌టైల్స్, స్వదేశీ యంత్రాలను కూడా అభివృద్ధి చేస్తామని...

కాకి ఎత్తుకపాయే

వీధి అరుగు మీది  ముచ్చట్లని  కాకి ఎత్తుకపాయే   వేపచెట్టు నీడన  నులక మంచం  కాగితం బొమ్మాయే  గిలకబాయి వద్ద మట్టి కుండలు  శిథిలమయిపాయే  మర్రిచెట్టు కాడ  కుశాలుగా నవ్వుకునే నలుగురు మనుషుల జాడ కానరాక పాయే  పిండిగిర్ని వద్ద  కడుపారా పలకరించుకునే  తల్లులు మాటలు రాలిపాయే  నాలుగు చీరలై  పరుచుకున్న బొంత  కథగా మారిపాయే   తీరిక వేళ చేరి  ఆడుకునే పులిజూదం  మృత్యువాత పడే             - వెంకటేష్