టాలెంట్ ఎక్స్ ప్రెస్ 10వ వార్షికోత్సవ పుస్తకాన్ని ఆవిష్కరించిన కుమార్ పుంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ 10వ వార్షికోత్సవ పుస్తకాన్ని ఆవిష్కరించిన కుమార్ పుంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం

తెనాలి: టాలెంట్ ఎక్స్ ప్రెస్ 10వ వార్షికోత్సవ పుస్తకాన్ని  కుమార్ పుంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మంగళవారం ఆవిష్కరించారు. కుమార్ పుంప్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ సంఘ నేత కనపర్తి రత్నాకర్ ను అభినందించారు. గత పదేళ్లుగా టాలెంట్ ఎక్స్ ప్రెస్ పత్రికద్వారా పత్రికారంగం లో అనేక సేవలు రత్నాకర్ అందించారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారాలకోసం పత్రికలు కృషి చేయాలన్నారు. ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఎన్. సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.