ఘనంగా కృష్టాష్టమి వేడుకలు

ఘనంగా కృష్టాష్టమి వేడుకల



టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పట్టణంలో కృష్టాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం అన్ని ప్రధాన కృష్ణ మందిరాల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ కృష్ణుని నామస్మరణ తో మారుమ్రోగాయి. 
చినరావూరు శ్రీ కృష్ణ మందిరం పరిసరాలను విద్యుత్ తోరణాలతో అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణుని ప్రతిమ, పుష్ప తోరణాలు, కుత్రిమ జలపాతం, కృష్టుని బొమ్మతో ముద్రించిన వృత్తాకారపు జెండాలు
 భక్తులకు కనువిందు చేస్తున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో గురువారం ఉట్టి కొట్టే కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. శ్రీ కృష్ణ మందిర భక్తుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వేడుకలను కొనసాగిస్తున్నారు.