విజ్ఞాన్స్‌ వర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ వర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కన్వెన్షనల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆళ్ల సుశీల అనే విద్యార్థినికి తమ యూనివర్సటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘పెర్ఫార్మెన్స్‌ ఎవాల్యూషన్‌ ఆన్‌ యుటిలైజేషన్‌ ఆఫ్‌ స్నెయిల్‌ షెల్‌ పౌడర్‌ సిమెంట్‌ కాంపోసిట్‌ ఇన్‌ డిటీరియోరేటెడ్‌ స్ట్రక్చర్స్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేసిందని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని ప్రొఫెసర్‌ ఏ.శివశంకర్‌ గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 5 స్కూపస్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన ఆళ్ల సుశీలను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.