విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవ కుమార్ సల్లూరి కు తమ యూనివర్సటీ సీఎస్ఈ విభాగంలో సోమవారం పీహెచ్డీ పట్టా అందించిందని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ నోవెల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సివియారిటీ ప్రెడిక్షన్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతీ’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ కేవీ క్రిష్ణ కిషోర్ గైడ్గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 1 ఎస్సీఐ, 2 స్కూపస్ ఇండెక్డ్స్ జర్నల్స్, 2 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పేపర్లు పబ్లిష్ చేశారని తెలియజేసారు. పీహెచ్డీ పట్టా పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవ కుమార్ సల్లూరి ను వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అ...