రేపు రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్స్పో -2023

రేపు రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్స్పో -2023

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి : పట్టణానికి చెందిన రెయినో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్స్పో -2023 ను ఈనెల 15 న స్థానిక ఎన్జీఓ కళ్యాణమండపంలో నిర్వహించనున్నట్టు ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి . జీవ నలత తెలిపారు . మహిళా సాధికారతను ప్రోత్సహించే మార్గంలో కొత్త మహిళా ఎంటర్ ప్రెన్యూర్స్న ప్రోత్సహించే లక్ష్యంగా ఎక్స్ పో -2023 ను నిర్వహించనున్నట్లు విలేకరుల సమావేశంలో వివరించారు . ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎక్స్పోలో మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు . వీరితో పాటు వరలక్ష్మి , కల్యాణి , గాయత్రి , సృజన , జ్యోతి లు ఉన్నారు .