Skip to main content

తెనాలిలో వీణా అవార్డ్స్- 2023 పరిషత్ నాటక - నాటిక పోటీలు

తెనాలిలో వీణా అవార్డ్స్- 2023 పరిషత్ నాటక - నాటిక పోటీలు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి : 19-10-2023 : కళలకాణాచి - తెనాలి , వేదగంగోత్రి ఫోండేషన్ - విజయవాడ వారి సంయుక్త నిర్వహణలో అక్టోబర్ 20 వ తేదీ శుక్రవారం నుండి 24 వ తేదీ మంగళవారం వరకు తృతీయ జాతీయస్థాయి వీణా అవార్డ్స్ -2023 పద్యనాటక , సాంఘిక నాటిక పోటీలు జరుపుతున్నట్లు కళల కాణాచి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు , సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా తెలియజేశారు . స్థానిక గాంధీనగర్లోని సి.పి.ఐ. కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం ఆయన మాట్లాడుతూ తెనాలిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పరిషత్ పోటీలకు అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు . ఎంట్రీలో 35 పద్య నాటకాలు , 40 సాంఘిక నాటికలు రాగా ఒక్కో విభాగానికి ఏడు చొప్పున పోటీ ప్రదర్శనకు ఎంపికచేశాము . మరో నాలుగు సాంఘిక నాటకాలను పోటీతో సంబంధం లేకుండా ప్రదర్శించడానికి అనుమతిచ్చాము . గతంలో ఏప్రిల్లో పద్య నాటకాలు , అక్టోబర్లో సాంఘిక నాటికల పోటీలు జరిపాము . అయితే కళాకారులు అభ్యర్థనమేరకు దసరా సందర్భంగా రెండు విభాగాల నాటక , నాటికలను కన్నులపండుగగా ఒకే వేదికపై నిర్వహించాలని తలపెట్టాము . 20 వ తేదీ వీణా అవార్డ్స్ ప్రారంభోత్సవ సభలో ఏ.ఆర్ . కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారాన్ని హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత రంగస్థల నటుడు , దర్శకుడు నెమలికంటి తారక రామారావుకు ప్రదానం చేస్తారు . 24 వ తేదీ ముగింపు రోజున బుఱ్ఱా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని నెల్లూరుకు చెందిన ప్రముఖ పౌరాణిక నటుడు , గుణనిర్ణేత పొన్నాల రామసుబ్బారెడ్డికి ప్రదానం చేస్తున్నాము . ఈ కార్యక్రమాలలో ప్రముఖ సినీ హీరో అశోక్ గల్లా , హీరోయిన్ కుమారి మానస వారణాసి , సినీ దర్శకుడు వంశీ , సినీ నటులు ప్రదీప్ , విస్సు తదితరులు పాల్గొంటున్నట్లు సాయిమాధవ్ తెలిపారు . విలేకర్ల సమావేశంలో కళల కాణాచి ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగా , కోశాధికారి శ్రీమతి దేవరపల్లి భవాని , వ్యవస్థాపక కార్యదర్శి షేక్ జానిబాషా , సహాయ కార్యదర్శులు ఐనాల మల్లేశ్వరరావు , కొండముది రమేష్ , పీఆర్వో షేక్ అబ్దుల్ హకీం జాని , పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మదేవర వెంకటేశ్వరరావు , వెనిగళ్ళ నారాయణ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...