23న విజ్ఞాన్స్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం
_ ముఖ్య అతిథిగా సెంట్రల్ ఫైనాన్స్, కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్
_ గౌరవ అతిథులుగా హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ సుబ్బారావ్ పావులూరి, హైదరాబాద్లోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ వాసిరెడ్డి, ఇండియన్ చెస్ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి
_ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు ప్రధానం
_1800 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
అక్టోబర్ 23వ తేదీ సోమవారం విజ్ఞాన్స్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ 23న జరిగే 11వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఫైనాన్స్, కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, గౌరవ అతిథులుగా హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ సుబ్బారావ్ పావులూరి, హైదరాబాద్లోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ వాసిరెడ్డి, ఇండియన్ చెస్ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి హాజరవుతున్నారని పేర్కొన్నారు.
1800 మందికి పైగా డిగ్రీలు అందజేత
11వ స్నాతకోత్సవం సందర్భంగా తమ యూనివర్సిటీ 1800 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనుందని వైస్ చాన్స్లర్ తెలిపారు. 11వ స్నాతకోత్సవం సందర్భంగా 24 మంది విద్యార్థులకు బ్రాంచిల వారీగా అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు అందజేస్తామన్నారు. వీటితో పాటు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ మెడల్, ఎండోమెంట్ అవార్డులు, బహుముఖ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి చైర్మన్ బంగారు పతకం, బెస్ట్ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, సోషల్ ఎంగేజ్మెంట్ అవార్డు, బెస్ట్ లీడర్ మెడల్స్ ఉంటాయన్నారు. వివిధ విభాగాలలో అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థులకు కూడా ప్రత్యేక బహుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.
ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు
11 స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వివిధ రంగాలలో వారు అందించిన సేవలు, కృషికు గాను ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేయనుందని తెలిపారు. హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ సుబ్బారావ్ పావులూరి, హైదరాబాద్లోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ వాసిరెడ్డి, హైదరాబాద్లోని ఇండియన్ చెస్ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపిలు గౌరవ డాక్టరేట్లు అందుకోనున్నారు. 23 న జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు.