విజ్ఞాన్స్‌ను సందర్శించిన అబెట్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌ తనిఖీ బృందం

విజ్ఞాన్స్‌ను సందర్శించిన అబెట్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌ తనిఖీ బృందం

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీను అబెట్‌( అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌ కమిటీ బృందం తనిఖీ నిర్వహించింది. అమెరికా నుంచి వచ్చిన 11 మంది సభ్యులతో కూడిన తనిఖీ బృందం యూనివర్సిటీలో మూడు రోజుల పాటు తనిఖీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లడుతూ రెండు తెలుగు రాష్ట్ర్రాలలో అబెట్‌ అక్రిడిటేషన్‌కు దరఖాస్తు చేసుకుని తనిఖీ పూర్తి చేసుకున్న మొట్ట మొదటి యూనివర్సిటీ విజ్ఞాన్‌ అని తెలియజేసారు. తనిఖీ విజయవంతమై అబెట్‌ అక్రిడిటేషన్‌ సాధించినట్లైతే విదేశాలలో ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు బాగా మెరుగవుతాయని తెలియజేసారు. వీటితో పాటు విదేశాలలో ఉన్న యూనివర్సిటీలతో విద్యార్థులకు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్, ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్స్, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. అబెట్‌ అక్రిడిటేషన్‌ ఉన్న యూనివర్సిటీలకు ఎప్పటికప్పడు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌తో పాటు కంటిన్యూస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఐక్యూఏసీ సిబ్బంది, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.