నెహ్రూనికేతన్‌లో అంబరాన్ని అంటిన దసరా సంబరాలు

నెహ్రూనికేతన్‌లో అంబరాన్ని అంటిన దసరా సంబరాలు  


తెనాలి : స్థానిక బోస్‌రోడ్డులోని నెహ్రూనికేతన్‌ పాఠశాలలో శుక్రవారం ఉదయం ముందస్తు దసరా వేడుకలను ఘనంగా జరిపారు.  పాఠశాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీకాంత్‌ వి దాసరి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డి. గీతాకాంత్‌  పర్యవేక్షణలో జరిగిన ఈ సంబరాలలో దుర్గామాతను  చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో మురళీకాంత్‌ మాట్లాడుతూ తెలుగువారి పండుగలలో దసరా పండుగ చాలా విశిష్ఠమైందని, విజయానికి చిహ్నంగా జరుపుకునే ఈ దసరా పండుగ అందరికీ విజయాన్ని చేకూర్చాలని  ఆకాంక్షించారు. గీతాకాంత్‌ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ అందరూ భక్తి శ్రద్ధలతో నడుచుకోవాలని సూచించారు.  చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఆధ్యాత్మిక పాటలకు కోలాటం వంటి సంప్రదాయ నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత వన్నె తెచ్చారు. కొందరు చిన్నారులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించగా మరి కొందరు కోలాటం నృత్యాన్ని ప్రదర్శించారు.  ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.