ఆంధ్రప్రదేశ్ కి జగనేఎందుకు కావాలంటే

ఆంధ్రప్రదేశ్ కి జగనేఎందుకు కావాలంటే..


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, చుండూరు:
జగన్మోహన్ రెడ్డి మళ్లీ మళ్లీ సీఎం కావాలి అని మంత్రి నాగార్జున అన్నారు మండల పరిధిలోని వలివేరు గ్రామం కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటుచేసిన ఆంధ్ర ప్రదేశ కి జగనే ఎందుకు  కవాలంటే అనే కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా విద్య వైద్య రంగాల్లోనూ ఇంటి స్థలాలు విషయంలోనూ ఇల్లు కట్టించే విషయంలోనూ విద్యార్థులకు వృద్ధులకు వికలాంగులకు వ్యవసాయ రంగంలోనూ రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఎక్కడ కూడాను అవినీతి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాలోనే  నేరుగాజమ అయ్యేవిధంగా చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వాలు ప్రజలకు ఏమిచ్చాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమిస్తుంది అని బేరి చేసుకుని ఓటు వేయాలన్నారు  చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే గాక మేనిఫెస్టోను కూడా కనబడకుండా చేశారన్నారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి భక్తుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్లీ మళ్లీ సీఎం అవ్వాలంటే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ సీపీకి మద్దతుగా ఉండాలన్నారు నేటి నుండి సర్పంచులు జెడ్పిటిసిలు ఎంపీటీసీలు  గృహ సారధులు వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మండల  పార్టీఅధ్యక్షులు అన్నపురెడ్డి రఘురామిరెడ్డి ఎంపీపీ  జాలాది రూబెన్ జడ్పిటిసి సభ్యురాలు దాట్ల సౌజన్య మోహన్ రెడ్డి ఉయ్యూరు అప్పి రెడ్డి గాద శివరామ కృష్ణారెడ్డి వీరారెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు