Skip to main content

Posts

Showing posts from November, 2023

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయస్థాయి పేటెంట్‌ మంజూరయ్యిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అధ్యాపకులు డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.సంపత్‌ కుమార్, డాక్టర్‌ దిరిశాల విజయరాము, ముగ్గురు విద్యార్థులు సంయుక్తంగా ప్రతిపాదించిన ‘‘ యాన్‌ ఎడిబుల్‌ ప్లేవర్‌ ఎన్‌హ్యాన్స్‌ ఫ్రమ్‌ పెరిగోప్తలిస్‌ పార్దాలిస్‌’’ అనే అంశానికి ప్రముఖ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఇండియా అథారిటీ పేటెంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. వీరు ప్రతిపాదించిన ఈ పేటెంట్‌కు 20 సంవత్సరాల పాటు హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పేటెంట్‌ ప్రతిపాదనలో బయోటెక్‌ విద్యార్థులైన కే.మృదులా చౌదరి, టీ.సతీష్‌ కుమార్, జే.జాస్మిన్‌ రెడ్డి  ముఖ్య భూమిక పోషించారని తెలిపారు.  పెరిగోప్తలిస్‌ అనే చేప కొల్లేరు సరస్సుల్లో విరివిగా లభిస్తూ మిగిలిన అన్ని చేపలకు హానికలగచేస్తూ పర్యావరణ అసమతుల్యానికి...

జనవరి 1 నుంచి జాతీయ స్థాయి క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

జనవరి 1 నుంచి జాతీయ స్థాయి క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి మహోత్సవ్‌–2కే24లో భాగంగా జాతీయ స్థాయి క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు యంగ్‌ ఇండియన్స్‌ ( వుయ్‌ కెన్‌ వుయ్‌ వెల్‌) సంస్థ ఈవెంట్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఫార్మసీ కళాశాలల్లో డిగ్రీ, పీజీలను అభ్యసించే విద్యార్థులందరూ ఈ పోటీలలో పాల్గొనవచ్చునని తెలియజేసారు. ఒకే కళాశాల నుంచి ఎన్ని జట్లైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని... అయితే ఒక టీమ్‌లో ఆడిన విద్యార్థి మరో టీమ్‌లో ఆడటానికి వీల్లేదని వెల్లడించారు. మ్యాచ్‌లను నాకౌట్‌ పద్దతిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజేతలుగా నిలిచిన జట్లకు ప్రశంసా పత్రాలు...

విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి పీహెచ్‌డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన  కర్రి మరియదాసు అనే అధ్యాపకుడికి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ పట్టా అందజేసిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పల్నాడు జిల్లాలోని భూగర్భ జలాల అంచనా – ప్రభావాలు, తాగునీరు, నీటిపారుదల నాణ్యత’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేసారు. ఈయనకు ఆంధ్ర యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ టీ.శివరావు గైడ్‌గా వ్యవహరించారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టా పొందిన కర్రి మరియదాసును విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.

ఉద్యోగాలు, పరిశోధనలకు పెద్దపీట

ఉద్యోగాలు, పరిశోధనలకు పెద్దపీట   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: అన్ని విజ్ఞాన్‌ కార్యాలయాలు, యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నందు అందుబాటులో దరఖాస్తులు   మార్చి 1 నుంచి నుంచి ఏప్రిల్‌ 30  వరకు బీటెక్‌/బీఫార్మసీ ప్రవేశ పరీక్ష వీశాట్‌–2024 దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 25 దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు  ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు  వీశాట్‌–2024 ప్రధాన అంశాలు ఇవే యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశోధనలకు పెద్ద పీట వేయడంలాంటి సమున్నత లక్ష్యాలతో తాము ముందుకెళుతున్నామని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు.   విజ్ఞాన్‌ యూనివర్సిటీ 2024–25 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎం...

ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు

ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఇండస్ట్రియల్ స్కిల్స్లో వర్చువల్ ఇంట స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి . ఏఐ సీటీఈ , ఎడ్యు స్కిల్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వ ర్యంలో ఈ నెల 17 , 18 , 19 తేదీల్లో గోవాలో నిర్వ హించిన స్కిల్ కనెక్ట్ యాన్యువల్ మీట్లో కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ ఈ అవార్డు లను స్వీకరించారు . గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ , ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతా రాం , ఎన్బీఏ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కె.కె.అ గర్వాల్ ప్రారంభించిన ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా గల ప్రముఖ యూనివర్శిటీలు , ఇంజినీ రింగ్ కాలేజిలు , డిగ్రీ , పాలిటెక్నిక్ కాలేజిల ప్రతి నిధులు పాల్గొన్నారు . గూగుల్ , ఫోర్టినెట్ , పాలో ఆల్టో , ఎరిక్సన్ , టెక్ మహేంద్ర వంటి కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు . సైబర్ సెక్యూరిటీ , గూగుల్ డెవలపర్ , ఏఐ అండ్ ఎంఎల్ , ఆర్పీఏ , నెట్వర్క్ సెక్యూరిటీ వంటి ఇండస్ట్రీ స్కిల్స్ విభా గాల్లో ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2023 వరకు వర్చువల్ ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వివిధ యూనివర్శ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయస్థాయి పేటెంట్‌ మంజూరయ్యిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ జీ.శ్రీనివాసరావు, జేఎన్‌టీయూ కాకినాడలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఎస్‌.శివనాగరాజులు సంయుక్తంగా ప్రతిపాదించిన ‘‘ హైబ్రిడ్‌ ఆటో రిక్షా’’ అనే అంశానికి ప్రముఖ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఇండియా అథారిటీ పేటెంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. వీరు ప్రతిపాదించిన ఈ పేటెంట్‌కు 20 సంవత్సరాల పాటు హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పేటెంట్‌ వలన హైబ్రిడ్‌ ఆటో రిక్షాల సహాయంతో దేశంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో శబ్ధ, కాలుష్య రహిత రవాణా వ్యవస్థను అందించవచ్చునన్నారు. ఆటో రిక్షాల నిర్మాణంలో గణనీయమైన మార్పులు అవసరం లేకుండా ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ ఆటో రిక్షాను అభివృద్ధి చేయవచ్చునన్నారు. అదే సమయంలో సోలార్‌ బ్యాటరీ చార్జ్‌ సిస్టమ్‌ సహాయంతో విద్యుత్‌ శక...

కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు

కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు తెనాలి: స్థానిక కొత్తపేటలోని మహిళా, బాలల గ్రంధాలయంలో 56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం గ్రంధాలయాన్ని ఆంధ్ర ప్రదేశ్ పౌర గ్రంథాలయ డిప్యూటీ డైరెక్టర్  షేక్ పీర్ అహ్మద్  మరియు గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి  కందుల ఝాన్సీ లక్ష్మి లు సందర్శించారు. పుస్తక పఠనం ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని ఆంజని పర్యవేక్షించారు. పట్నాల నాగేంద్రరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉద్భవ్‌–2కే23

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉద్భవ్‌–2కే23 ’ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ మీట్‌ ‘ఉద్భవ్‌–2కే23’ వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కైజెన్‌( కీ టు ఆంబీషియస్‌ అండ్‌ ఇంటెలెక్చుయల్‌ జోన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ నోవల్టీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సౌత్‌ రిస్క్‌ హెడ్‌ ఎస్‌.సాయి సునీల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాయి సునీల్‌  మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నింటిలోకి ఎకానమి పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదేనని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో మన దేశం 5 ట్రిలియన్‌ ఎకానమీ రేటును సాధించి మూడవ అతి పెద్ద ఎకానమీ కలిగిన దేశంగా నిలుస్తామని తెలియజేసారు. ఇదే వృద్ధి ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఆటిట్యూడ్‌ పా...

సంగం డెయిరి నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ

సంగం డెయిరి నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  పదమూడు రకాల నూతన  బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్ ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగం డెయిరి చైర్మన్ ధూలిపాళ్ళ నరేంద్ర కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు. ఆట లడ్డు 200 గ్రామ్స్ , బేసిన్ లడ్డు 200 గ్రామ్స్ , చేనా లడ్డు 200 గ్రామ్స్, ప్లెయిన్ కాజు బైట్స్, ఆరంజ్ కాజు బైట్స్ , చాక్లెట్ కాజు బైట్స్200 గ్రామ్స్, బాదం రాకీ 200 గ్రామ్స్ , పైనాపిల్ బార్ కేక్ 32 గ్రామ్స్ , కాజు స్టిక్స్120&200 గ్రామ్స్ , ప్లమ్ కేక్ 100 గ్రామ్స్ , గులాబ్ జామున్ 1/2 కేజీ(500గ్రామ్స్), కుర్ద్ కుప్స్ 200గ్రామ్స్, సుచేట్ కుర్ద్ లను మార్కెట్లో ఆవిష్కరించిన సంగం డెయిరి. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఏజెంట్లు. సంగం డెయిరి పాల పదార్థాలను కంపెనీ వివిధ దశలలో 114 రకాల పరీక్షలు నిర్వహిస్తుందని తెలియజేసిన చైర్మన్.8 వేలకు పైగా డిస్ట్రిబ్యూటర్లు మరియు ఏజెంట్ల ద్వారా 82 రకాల పాలు మరియు పాల ఉత్పత్తులను 160 వివిధ  పరిమాణాల్లో లక్షలాది గృహాలకు సరఫరా చేస్తున్నామని తెలియజేసిన చైర్మన్. ఆంధ్ర...

బొల్లిముంత శివరామకృష్ణ చిరస్మరణీయుడు

ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, నవలా రచయితగా, సినీ రచయితగా, సంపాదకుడిగా బహుముఖీనమైన ప్రతిభను కనరపరచిన బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య ప్రపంచంలో మృత్యుంజయుడిగా నిలిచిన బొల్లిముంత శివరామకృష్ణ గారి జన్మదిన జ్ఞాపకం !    🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿 బొల్లిముంత శివరామకృష్ణ (నవంబరు 7, 1920 - జూన్ 7, 2005) అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్రులపై చూపుతోన్న వివక్షని తరిమెల నాగిరెడ్డి చేత పలికించిన రచయిత.. తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం, మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు. మనుషులు మారాలి ఆమె ఎవరు సినిమాల సంభాషణకర్త ఆయనే. • జీవిత విశేషాలు... గుంటూరు జిల్లా చదలవాడలో అక్కయ్య, మంగమ్మ దంపతులకు జన్మించిన శివరామకృష్ణ గుంటూరులోనే హయర్‌ గ్రేడ్ ట్రెయినింగ్ పూర్తిచేశారు. ఆయన తండ్రి చదలవాడలో పాఠశాల నెలకొల్పడంతో ఉపాధ్యాయుడిగా అందులోనే చేరారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, త్రిపురనేని గోపీచంద్ లతో పరిచయం కలిగింది. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేవి. అందుకు...

సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం

సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం   _ ఎ.పి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫేడరేషన్ 16 వ వార్షికోత్సవ వేడుకల్లో డిఎస్పి జనార్ధనరావు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం అని జర్నలిస్టుల సేవలు అభినందనీయమని డిఎస్పీ బి . జనార్ధనరావు అన్నారు . ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 16 వార్షికోత్సవ వేడుకలు తెనాలిలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో అనాధలకు అన్నదానం చేసారు . కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిఎస్పీ పాల్గొన్నారు . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ఫెడరేషన్ పనిచేస్తుందని , 16 వ వార్షికోత్సవం నిర్వహించడం అభినందనీయం అన్నారు . కుర్రా శ్రీను సేవలను ప్రశంసించారు . బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మగాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో తాలూకా ఎస్.ఐ సి.హెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు . ఫెడరేషన్ ఆధ్వర్యంలో స...

సీఎం జగన్మోహన్ రెడ్డి కి జర్నలిస్టులు కృతజ్ఞతలు

సీఎం జగన్మోహన్ కు జర్నలిస్టులు కృతజ్ఞతలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు శుక్రువారం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడంపట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం స్థానిక ఫెడరేషన్ కార్యాలయంలో ఈ సందర్భంగా థాంక్యూ సీఎం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల మంజూరు విషయంపై నేడు ప్రభుత్వం ఆమోదం తెలపడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ఫెడరేషన్ అనేక పోరాటాలు చేసిందని, ఇళ్ల స్థలాలు సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లిందని అన్నారు. ఈ పోరాట ఫలితంగానే  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు సమస్యలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. నియోజకవర్గ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టులను గుర్తించి వారికి కూడా ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని కోరారు. డివిజన్ కార్యదర్శి డి ద...

ఆలిండియా త్రోబాల్‌ జట్టుకు విజ్ఞాన్స్‌ విద్యార్థిని ఎంపిక

ఆలిండియా త్రోబాల్‌ జట్టుకు విజ్ఞాన్స్‌ విద్యార్థిని ఎంపిక చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన రెండో సంవత్సరం సీఎస్‌ఈ (ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌) డిపార్ట్‌మెంట్‌కు చెందిన  కిలారు భార్గవి అనే విద్యార్థిని ఆలిండియా త్రోబాల్‌ జట్టుకు ఎంపికైందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని బిజునూర్‌లో జరిగిన 43వ సీనియర్‌ నేషనల్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌–2023 టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రదర్శనకు గాను తమ విద్యార్థి ఆలిండియా జట్టుకు ఎంపికైందని వెల్లడించారు. వచ్చే సంవత్సరం జనవరి నెలలో దుబాయ్‌ దేశంలో జరిగే ఇంటర్నేషనల్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుందని తెలియజేసారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన టౌర్నమెంట్‌లో పది రాష్ట్రాలకు చెందిన జట్లు నాలుగు రోజుల పాటు జరిగిన లీగ్‌ కమ్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో తమ యూనివర్సిటీకు చెందిన మొత్తం 5 గురు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టీమ్‌ తరుపున పాల్గొని రెండో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ట...