కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు
తెనాలి: స్థానిక కొత్తపేటలోని మహిళా, బాలల గ్రంధాలయంలో 56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం గ్రంధాలయాన్ని ఆంధ్ర ప్రదేశ్ పౌర గ్రంథాలయ డిప్యూటీ డైరెక్టర్ షేక్ పీర్ అహ్మద్ మరియు గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కందుల ఝాన్సీ లక్ష్మి లు సందర్శించారు. పుస్తక పఠనం ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని ఆంజని పర్యవేక్షించారు. పట్నాల నాగేంద్రరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు