Skip to main content

ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు

ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఇండస్ట్రియల్ స్కిల్స్లో వర్చువల్ ఇంట స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి . ఏఐ సీటీఈ , ఎడ్యు స్కిల్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వ ర్యంలో ఈ నెల 17 , 18 , 19 తేదీల్లో గోవాలో నిర్వ హించిన స్కిల్ కనెక్ట్ యాన్యువల్ మీట్లో కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ ఈ అవార్డు లను స్వీకరించారు . గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ , ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతా రాం , ఎన్బీఏ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కె.కె.అ గర్వాల్ ప్రారంభించిన ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా గల ప్రముఖ యూనివర్శిటీలు , ఇంజినీ రింగ్ కాలేజిలు , డిగ్రీ , పాలిటెక్నిక్ కాలేజిల ప్రతి నిధులు పాల్గొన్నారు . గూగుల్ , ఫోర్టినెట్ , పాలో ఆల్టో , ఎరిక్సన్ , టెక్ మహేంద్ర వంటి కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు . సైబర్ సెక్యూరిటీ , గూగుల్ డెవలపర్ , ఏఐ అండ్ ఎంఎల్ , ఆర్పీఏ , నెట్వర్క్ సెక్యూరిటీ వంటి ఇండస్ట్రీ స్కిల్స్ విభా గాల్లో ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2023 వరకు వర్చువల్ ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వివిధ యూనివర్శిటీలు , కాలేజీకు అవార్డులు ప్రకటిం చారు . అన్ని ఇనిస్టిట్యూషన్స్ కేటగిరీలో దేశంలో
34 వ ర్యాంక్ , డిగ్రీ కాలేజిల్లో దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ , సౌతిండియాలో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ డిగ్రీ కాలేజి , పాలో ఆల్టో సైబర్ సర్టిఫికేషన్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ డిగ్రీ కాలేజి వంటి ప్రతిష్టాత్మక అవా ర్డులను ఏఎస్ఎన్ కాలేజి సొంతం చేసుకున్నట్టు విద్యా సంస్థల చైర్మన్ , స్థానిక ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు . ఇవికాకుండా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ కాలేజి నమో దైందని చెప్పారు . కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ చంద్ను సత్కరించారు .

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...