సీఎం జగన్మోహన్ రెడ్డి కి జర్నలిస్టులు కృతజ్ఞతలు

సీఎం జగన్మోహన్ కు జర్నలిస్టులు కృతజ్ఞతలు


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు శుక్రువారం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడంపట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం స్థానిక ఫెడరేషన్ కార్యాలయంలో ఈ సందర్భంగా థాంక్యూ సీఎం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల మంజూరు విషయంపై నేడు ప్రభుత్వం ఆమోదం తెలపడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ఫెడరేషన్ అనేక పోరాటాలు చేసిందని, ఇళ్ల స్థలాలు సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లిందని అన్నారు. ఈ పోరాట ఫలితంగానే  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు సమస్యలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. నియోజకవర్గ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టులను గుర్తించి వారికి కూడా ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని కోరారు. డివిజన్ కార్యదర్శి డి దొండపాటి కోటేశ్వరరావు, నియోజకవర్గ కార్యదర్శి పి పున్నయ్య, వేమూరు నియోజకవర్గం అధ్యక్షులు మేకల సుబ్బారావు, ఎస్ ఎస్ జహీర్ బచ్చు సురేష్ బాబు జర్నలిస్టుల స్థలాలు మంజూరు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి, స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో డి నాగరాజు, కరేటి సాంబశివరావు, వి వి ఆర్ నాయుడు, సిహెచ్ చంద్రశేఖర్, ఎ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.