సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం

సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం 
_ ఎ.పి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫేడరేషన్ 16 వ వార్షికోత్సవ వేడుకల్లో డిఎస్పి జనార్ధనరావు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:

సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం అని జర్నలిస్టుల సేవలు అభినందనీయమని డిఎస్పీ బి . జనార్ధనరావు అన్నారు . ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 16 వార్షికోత్సవ వేడుకలు తెనాలిలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో అనాధలకు అన్నదానం చేసారు . కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిఎస్పీ పాల్గొన్నారు . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ఫెడరేషన్ పనిచేస్తుందని , 16 వ వార్షికోత్సవం నిర్వహించడం అభినందనీయం అన్నారు . కుర్రా శ్రీను సేవలను ప్రశంసించారు . బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మగాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో తాలూకా ఎస్.ఐ సి.హెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు . ఫెడరేషన్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు చేస్తున్న ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారిని సత్కరించారు . రామలింగాచారి ఫెడరేషన్ సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం ఫెడరేషన్ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టులు బచ్చు సురేష్ బాబు , ఎస్.ఎస్ . జహీర్ ను ఫెడరేషన్ సభ్యులు సత్కరించారు . గత 16 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమానికి ఫెడరేషన్ అలుపెరగని పోరాటాలు ని జర్నలిస్టుల సమస్యల పరిష్కరించడంలో ముందుంటుందని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ , డివిజన్ కార్యదర్శి డి . కోటేశ్వరరావు , నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్ , కార్యదర్శి పుట్ట పున్నయ్య , వేమూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎం . సుబ్బారావులు అన్నారు . కార్యక్రమంలో నాయకులు జి . ప్రకాశరావు , అచ్ముత సాంబశివరావు , బి . చంద్రమోహన్ సభ్యులు
వి . లక్ష్మణరావు , ఉనం భూషణరావు , మునిపల్లి శ్రీకాంత్ , ఎం . ప్రసాద్ , డి . రవికిరణ్ , అత్తోట సంజయ్ , ఎస్.జె శ్యామ్యూల్ , ఎం . బాస్కర్ , కరేటి సాంబశివరావు , యు . కోటేశ్వరరావు , దాసరి వెంకటేశ్వరరావు . కె . కృష్ణ , బి . ప్రవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .