Skip to main content

కొత్త ఐడియాలతోనే జీవితంలో మార్పు

కొత్త ఐడియాలతోనే జీవితంలో మార్పు

  విజయవాడలోని ఎస్‌టీపీఐ జాయింట్‌ డైరక్టర్‌ బీ.వినయ్‌ కుమార్‌

  విజ్ఞాన్స్‌లో ఘనంగా వీఐఐఐఎస్‌ఏ టీబీఐ స్టార్టప్‌ ఫండింగ్‌ సదస్సు

  సదస్సుకు 12 రాష్ట్రాల నుంచి హాజరైన 30 స్టార్టప్‌ కంపెనీలు
 టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
జీవితంలో ఎవరైనా మార్పుతో పాటు అభివృద్ధి చెందాలనుకుంటే కొత్త ఐడియాలతోనే సాధ్యమని విజయవాడలోని ఎస్‌టీపీఐ జాయింట్‌ డైరక్టర్‌ బీ.వినయ్‌ కుమార్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  టెక్నాలజీ బిజినెస్‌ ఇంకుబేటర్‌ వారు న్యూఢిల్లీలోని డీఎస్‌టీ ఆర్థిక సహాయంతో ‘‘ వీఐఐఐఎస్‌ఏ (విజ్ఞాన్స్‌ ఇన్నోవేషన్, ఇగ్నిషన్‌ అండ్‌ ఇంకుబేషన్‌ ఫర్‌ స్టార్టప్‌ యాక్సిలరేషన్‌) టెక్నాలజీ బిజినెస్‌ ఇంకుబేటర్‌ స్టార్టప్‌ ఫండింగ్‌ ఏంజెల్‌ ఇన్వెస్టర్స్‌ అండ్‌ వెంచర్‌ క్యాపటలిస్ట్స్‌) సదస్సు కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు 12 రాష్ట్రాల నుంచి ఎంపికచేసిన 30 స్టార్టప్‌ కంపెనీలు హాజరయ్యాయి. ఈ 30 కంపెనీలు ప్రారంభించాలనుకుంటున్న వివిధ రకాల స్టార్టప్‌ కంపెనీల ఐడియాలను ఈ సదస్సులో తెలియజేసారు. ఉత్తమంగా ఉన్న స్టార్టప్‌ కంపెనీల ఐడియాలకు విజ్ఞాన్స్‌ టీబీఐ ఆర్థికంగా తోడ్పాటునందించనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడలోని ఎస్‌టీపీఐ జాయింట్‌ డైరక్టర్‌ బీ.వినయ్‌ కుమార్‌ మాట్లాడుతూ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి ఎల్లప్పుడు ఆర్థిక తోడ్పాటును అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరికైనా కొత్త ఐడియాలు ఉన్నట్లైతే వాటిని వెంటనే అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేయాలన్నారు. దేశంలో వివిధ రకాల ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను స్థాపిస్తేనే దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్‌ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడలోని ఎస్‌టీపీఐ డెప్యూటీ డైరెక్టర్‌ డీ.కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ చిన్న చిన్న ఆలోచనలకు టెక్నాలజీను జోడించడం ద్వారా పెద్ద బిజినెస్‌గా మార్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సత్గురు క్యాటలైజర్స్‌ సీఈవో పీ.గోపాల క్రిష్ణ, ఎండియా పార్టనర్స్‌ వెంచర్‌ క్యాపటలిస్ట్‌ రాఘవ గుప్త, సక్సీడ్‌ వెంచర్స్‌ ఏంజల్‌ ఇన్వెస్టర్‌ రుతిక్‌ జాదవ్, హైదరాబాద్‌  ఏంజల్స్‌ బోర్డ్‌ మెంబర్‌ సుబ్బారావు నీలంరాజు, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...