Skip to main content

రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం

రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం

తెనాలి: సమాజంలో సేవా సంస్థల పాత్ర ప్రముఖమని అందులోనూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంస్థ చేస్తున్న సేవలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ అన్నారు. స్థానిక కార్యాలయంలో బుదవారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్లబ్ సేవలను అభినందిస్తూ అభినందన సభ జరిగింది. సభకు తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్ అధ్యక్షత వహించారు. రత్నాకర్ మాట్లాడుతూ 2024 సంవత్సరానికి గాను ఫెడరేషన్ సభ్యులైన 34మందికి పోస్టల్ ప్రమాద భీమా రోటరీ అందించడం హర్షణీయమన్నారు. రూ 14,400 ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళి ద్వారా రోటరీ కార్యవర్గం చెల్లించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవి కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు సేవలు గుర్తించి క్లబ్ ద్వారా పోస్టల్ ప్రమాద భీమా కల్పించడం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిలా ఉంటూ ప్రజాసమస్యలు పరిష్కారంలో జర్నలిస్టులు ముందుంటారని వారి సేవలు ఉన్నతమైనవని ప్రశంసించారు. జర్నలిస్టులకు తమవంతు సేవలు అందించడంలో ముందుంటామని, రోటరీ క్లబ్ సెక్రెటరీ నల్లూరి వెంకేశ్వర్లరావు, కోగంటి శ్రీనివాసరావు, డి మురళి కృష్ణ, కటారి చేతన్ రాజ్, క్లబ్ పూర్వ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణ చంద్ అన్నారు. అనంతరం పోస్టల్ ప్రమాద భీమా బాండ్ పత్రాలను ఫెడరేషన్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు పుట్ల పున్నయ్య, మేకల సుబ్బారావు, గురిందపల్లి ప్రభాకరరావు, బచ్చు సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్, నరేష్ కుమార్ జైన్, ఎన్ జె శామ్యూల్, గుమ్మడి ప్రకాశరావు, అచ్యుత సాంబశివరావు, సిహెచ్ చంద్రశేఖర్, మునిపల్లి శ్రీకాంత్, బొరిగొర్ల చంద్రమోహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...