Skip to main content

ప్రపంచ ఔషధశాలగా భారత్‌



  ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎమ్‌ విలియమ్‌ క్యారే

  విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
దేశంలో ఫార్మారంగం శరవేగంగా అభివృద్ధి చెందటంతో పాటు ప్రపంచ దేశాలకు భారతదేశం ఔషధశాలగా పేరొందుతోందని ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎమ్‌ విలియమ్‌ క్యారే అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రాక్టీస్‌ ఆధ్వర్యంలో ‘‘ అడ్వాన్డ్స్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ గ్లోబల్‌ హెల్త్‌కేర్‌’ అనే అంశంపై మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సును శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సును ‘‘కొలాబరేటివ్‌ బ్లెండింగ్‌ ఆఫ్‌ ఐడియాస్‌ అండ్‌ ఇన్‌సైట్స్‌ టు ఎంపవర్‌ ఫార్మాసిస్ట్స్‌ టువర్డ్స్‌ ఏ హెల్తియర్‌ వరల్డ్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎమ్‌ విలియమ్‌ క్యారే మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతో కొత్త ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి నెలవైన ఫార్మా రంగంలో అవకాశాలకు కొదవలేదన్నారు. రోగులకు మందులు అందించడం దగ్గర్నుంచి ఔషధాల పరిశోధన వరకూ విద్యార్థులు అనేక ఉద్యోగ అవకాశాలు అందుకోవచ్చన్నారు. కోవిడ్‌ అనంతరం ఫార్మారంగం ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు. భవిష్యత్‌లో ఫార్మారంగం విస్తరణ, కొత్త ప్రాజెక్టుల కారణంగా ఉపాధి మార్గాలు మరింత విస్తతమవుతాయన్నారు. ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి సరికొత్త టెక్నాలజీలను ఫార్మసీ రంగంలో వినియోగించి సరికొత్త ఆవిష్కరణలను రూపొందించవచ్చునన్నారు. ఫార్మా కోర్సులు చదివిన వారు ఆస్పత్రుల్లో ఫార్మాసిస్టులు, అనలిటికల్, పరిశోధన, అభివృద్ధి, మెడికల్‌ రేటింగ్స్, డేటా అనాలిసిస్‌ విభాగాలతో పాటు పలు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకోవచ్చన్నారు.ఔషధ వినియోగాన్ని మెరుగుపరిచి మందుల లోపాలను తగ్గించటం ద్వారా రోగుల భద్రతను కాపాడటంలో ఫార్మాసిస్టుల కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. రోగి ఒక ఔషధాన్ని తీసుకున్నప్పుడు అతనికి ఏ విధంగా కూడా హాని కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫార్మాసిస్టులపై ఉందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన యూఎస్‌ఏలోని థింక్‌ రోమన్‌ వెంచర్స్, అవెండా ఇన్నోవేషన్స్‌ చైర్మన్, ఎండీ, డీఎమ్‌ఐ, ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అశ్విని ధార్‌ మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మానవ శరీరంలో చోటుచేసుకుంటున్న అనేక రుగ్మతల నివారణకు సమర్ధవంతమైన ఔషధం అందించాల్సిన బాధ్యత ఫార్మాసిస్ట్‌లదేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఫార్మాసిస్ట్‌ ఆ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 1000 మందికి పైగా హాజరయ్యారు. కార్యక్రమంలో యూఎస్‌ఏలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫిండ్లే ప్రొఫెసర్‌ ఎమ్‌.చంద్రశేఖర్, యూనివర్సిటీ ఆఫ్‌ ఫిండ్లే ఫార్మసీ డీన్‌ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ అఫైర్స్‌ డాక్టర్‌ టాన్య ఏ.డాటర్‌మన్, విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీనివాసబాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...