నంది నాటకోత్సవాల్లో తెనాలి వైభవం చాటిన కళల కాణాచి కళాకారులు


నంది నాటకోత్సవాల్లో తెనాలి  వైభవం చాటిన కళల కాణాచి కళాకారులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ :
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవం లో స్టార్ సినీ రైటర్ డాక్టర్ బర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో లో నిర్వహిస్తున్న కళల కాణాచి తెనాలి వారి జనక్ జనక్ పాయల్ భాజే సాంఘిక నాటకం పలు విభాగాల్లో బహుమతులు అందుకుని తెనాలి కళా వైభవాన్ని మరో సారి చాటింది. ఉత్తమ ప్రతి నాయకుడు, ఉత్తమ బాల నటి, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ హాస్య నటుడు అవార్డులను సొంతం చేసుకుంది. రచన , దర్శకత్వం డాక్టర్ ఎం. ఎస్. చౌదరి వహించారు.