ఈ నెల 14 న వైకుంఠపురం లో సామూహిక భోగిపళ్ళ వేడుక

ఈ నెల 14 న వైకుంఠపురం లో...సామూహిక భోగిపళ్ళ వేడుక
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాల క్రమంలో,ఆదివారం ఉదయం 10గంటలకు, తెనాలి వైకుంఠపురం లో, భోగి పండుగ సందర్భంగా, 11 సంవత్సరాల లోపు చిన్నారులకు ,సామూహిక భోగిపళ్ళ వేడుక నిర్వహించ నున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ ఎమ్.తిమ్మా నాయుడు,ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోజున ఆలయానికి వచ్చే భక్తులు, తమ కుటుంబంలోని చిన్నారులతో వచ్చి, భోగిపళ్ళ వేడుక లో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.