Skip to main content

భారత్‌ – ఇజ్రాయిల్‌ సంబంధాలు మరింత బలోపేతం

భారత్‌ – ఇజ్రాయిల్‌ సంబంధాలు మరింత బలోపేతం

 - భారతదేశంలో ఇజ్రాయిల్‌ రాయబారి నవోర్‌ గిలోన్‌
- విజ్ఞాన్స్‌ యూనివర్సిటీను సందర్శించిన ఇజ్రాయిల్‌ ప్రతినిధులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
భారత్‌–ఇజ్రాయిల్‌ దేశాల మధ్య అగ్రికల్చర్‌ రంగం విభాగంలో టెక్నాలజీతోపాటు పరస్పర అవగాహన సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని భారతదేశంలో ఇజ్రాయిల్‌ రాయబారి నవోర్‌ గిలోన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇజ్రాయిల్‌ రాయబారి నవోర్‌ గిలోన్‌తో పాటు ఇతర ప్రతినిధులకు వర్సిటీ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో అకడమియాతో పాటు దౌత్యపరమైన అంశాల గురించి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌తో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్‌ రాయబారి నవోర్‌ గిలోన్‌తో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, వివిధ విభాగాల డీన్లు, అధిపతులతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్‌ దేశ అంబాసిడర్‌ నవోర్‌ గిలోన్‌ మాట్లాడుతూ అగ్రికల్చర్‌ టెక్నాలజీ, విద్య, పరిశోధనలతో పాటు సాంస్కృతిక మార్పిడి, పరస్పర సహకార అవకాశాల అన్వేషణ వంటి అంశాల గురించి చర్చించామన్నారు. ఉమ్మడిగా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇరువురి మధ్య భాగస్వామ్యం పటిష్టమవ్వడంతో పాటు విద్యాపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. దీని ద్వారా విద్యార్థులకు, అధ్యాపక సిబ్బందికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడించారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్, అకడమిక్, పరిశోధన, కన్సల్టన్సీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ను అభివృద్ధి చేసుకోవడానికి అవగాహన ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వీటితో పాటు జాయింట్‌ మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను కూడా ప్రారంభిచేలా కృషి చేయాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథిని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. రాబోయే కాలంలో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు సరికొత్త టెక్నాలజీ, ఇండస్ట్రీ, అకడమియా ప్రోగ్రామ్స్‌ను రూపొందిచడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...