జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ద్వితీయస్థానం

జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ద్వితీయస్థానం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 02-01-2024: కెనడా రాజధాని ఒట్టావా కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ సంస్థ ఛాన్ హన్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడెమీ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 30, 31వ తేదీలలో రేపల్లెలో జరిగిన తొలి జాతీయ ట్రడీషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ -2023 జాతీయస్థాయి పోటీలు అండర్-12 బాలికల విభాగంలో స్థానిక బోస్రోడ్డులోని నెహ్రూనికేతన్ అయిదవ తరగతి చదువుతున్న షేక్ సనా ఫాతిమా ద్వితీయస్థానాన్ని కైవసం చేసుకుంది. నిర్వాహకులు ఇచ్చిన ధ్రువపత్రంతో పాటు రజత పతకాన్ని మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో నెహ్రూనికేతన్
మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి సనా ఫాతిమాకు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.