Skip to main content

తాలూకా హైస్కూల్ ప్రాంగణం విశేష ఆధ్యాత్మిక సేవకు వేదికకానుంది

తాలూకా హైస్కూల్ ప్రాంగణం విశేష ఆధ్యాత్మిక సేవకు వేదికకానుంది
శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తిరుమలలో శ్రీవారికి నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను ఈనెల 29నుండి ఫిబ్రవరి 4వరకు తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో వేదికగా శ్రీ గోవింద నామ జప యజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభ వోత్సవములు విశేషంగా నిర్వహించనున్నట్లు శ్రీ విద్యాపీఠం ,శ్రీ.సాలిగ్రామ మఠం     మఠాధిపతి   శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ వెల్లడించారు. గురువారం సాయంత్రం తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన ప్రచార బ్రో చర్లనుఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల స్వామీజీ మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారికి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు ఏ విధమై నటువంటి ఆర్జిత సేవలు నిర్వహిస్తారో, అదేవిధంగా తెనాలిలో ఏడు రోజులు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవములు ఉంటాయన్నారు 9 అడుగుల శ్రీవారి మూల విరాట్ కు ఆర్జిత సేవలను తిరుమలలో నిర్వహించే తీరుగా నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఏడు కోట్ల గోవింద నామ జప పూర్ణాహుతి కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకున్న అంశమని భక్తులు ఈ విశేష కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరారు .ఈవారం రోజులు అనేక మంది  సాదు పుంగవులు, ఆధ్యాత్మిక  సంపన్నులు ,ఆత్మీయ అతిథులుగా వేంచేయనున్న తెలిపారు. శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరువెంకట కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ విశేష కార్యక్రమంలో లక్షల లడ్డూల తో స్వామివారికి అర్చన నివేదన కార్యక్రమం,తొలిసారి గా,నిర్వహిస్తున్నట్లు తెలిపారు.లక్ష లడ్డూల తో అర్చన నివేదన ఇంతవరకు ఎక్కడా జరగలేదన్నారు. ప్రతిరోజు సాయంత్రం సామూహికముగ భక్తులచే సహస్ర గళార్చన కార్యక్రమం వీటితో పాటుగా ప్రతిరోజు సాయంత్రం శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచం పల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే, శ్రీ వెంకటేశ్వర వైభవ సప్తాహ ప్రవచన కార్యక్రమం ఉంటుందన్నారు. ఆధ్యాత్మిక చింతనా పరులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ఓ చక్కని కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే విధంగా ఏర్పాటు చేయడం, ముదా వహమని భక్తులు ఈ విశేష కార్యక్రమాలలో వారం రోజులపాటు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలసినదిగా కోరారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు సుప్రభాత సేవతో మొదలై, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవా కార్యక్రమం వరకు,తిరుమలలో నిర్వహించే తీరుగానెవైఖానస ఆగమ శాస్త్రానుసారముగ శ్రీవారి నిత్య పూజలు కొన సాగుతాయన్నారు. తెనాలి ప్రాంత భక్తులకు ఇదో చక్కని అవకాశంగా భావించి కార్యక్రమాలను తిలకించి స్వామి అనుగ్రహానికి పాత్రులు అయ్యే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు కార్యక్రమంలో కోన నాగేశ్వరరావు ,గోపు రామకృష్ణ ,ముద్దాబత్తుని రమణయ్య ,గొడవర్తి సాయి హరే రామ్ ,రావూరి సుబ్బారావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...