పంచరత్న కీర్తనలతో ఘనంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

పంచరత్న కీర్తనలతో ఘనంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
శిశు.ర్వేత్తి పశు ర్వేత్తి వేత్తి గానరసం ఫణిః శిశువులు,పశువులు,పాములను సైతం ఓల లాడించే సంగీత మాధుర్యాన్ని చాటుతూ భక్తి భావాంకిత కృతులను తన గాన మాధుర్యంతో భక్త జనానికి చేరువ చేసిన త్యాగరాజస్వామి 57వ ఆరాధనోత్సవం,స్ధానిక బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో, శ్రీ త్యాగరాజ గానసభ నిర్వాహణలో,మంగళవారం విశేషంగా నిర్వహించారు.ఈసందర్భంగా తొలుత శ్రీ సీతారామ స్వామికి పంచామృత స్న పన పూజలు,అనంతరం బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ మాడభూషి వేదాంత నరసింహాచార్యులు,వారి శిష్య బృందం త్యాగరాజ పంచరత్న కీర్తనలు సంగీత కచ్చేరి ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.ఇదే క్రమంలో,మారీస్ పేటకు చెందిన, రత్నాకరం శ్రీనివాసాచార్యులు చే,స్థాపించబడిన, శ్రీ త్యాగరాజ గానసభ కు,సుదీర్ఘకాలం సంగీత విద్వాంసులు గా,సంస్థకు బాధ్యాతాయుత సేవలు అందించిన,శతాధిక వృద్ధులు టివి.కృష్ణశర్మ ను,సంస్థ తరఫున సంత్కరించారు.కాగా విశేషంగా ఆలపించిన ఎందరో మహాను భావులు,అందరికీ వందనములు త్యాగరాజకీర్తన, రస హృదయులైన, సంగీత అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం యావన్మందికి ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అగ్నిహోత్రం ధన్వంతరి, పీవీ సుబ్బారావు, సంగీత జగద్గురు సేవా సమితి నిర్వాహకులు మృదంగ విద్వాంసులు కెవి రామకృష్ణ తదితర సంగీతాభిమానులు పాల్గొన్నారు.