సమాజంలో పత్రికా విలేకరుల బాధ్యత కీలకమైనది

సమాజంలో పత్రికా విలేకరుల బాధ్యత కీలకమైనది 
- డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
వేమూరు జనవరి 31: సమాజంలో పత్రికా విలేకరుల బాధ్యత కీలకమైనదని, ఆకలితో అలమటించిపోతున్నా లెక్కచేయక ,ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ సమాజ హితం కోరుతున్నారని, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ పర్సన్, ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ అన్నారు. బుధవారం స్థానిక ఎండిఓ కార్యాలయ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో అబ్రహం లింకన్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న దారుణాలను, ప్రభుత్వం బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ, సమస్యలను ఎలుగెత్తి ప్రజల ముందు బట్టబయలు చేస్తున్నారని, ఇందువల్ల తప్పులు చేసే నాయకులు, అధికారులు, సక్రమ మార్గంలో నడిచేందుకు విలేకరులు చేస్తున్న కృషి ఎంతైనా అభినందనీయమని అన్నారు. అధ్యక్షత వహించిన రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ ఫెడరేషన్ సమాజ హితం కోరడంతో పాటు ఫెడరేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తించబడిన తమ సంస్థ రాష్ట్రంలో విస్తృతంగా పనిచేస్తుందిని అన్నారు, ఈ సందర్భంగా నూతన కమిటీని సంస్కరించుకోవడం తమ బాధ్యతగా భావించామని, నూతన కమిటీ నాయకులను దృశ్యాలువా, పూలమాలు, బొకేలు మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైన మేకల సుబ్బారావు మాట్లాడుతూ, తమపై ఇచ్చిన ఈ గురు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఫెడరేషన్ కు మంచి పేరు తీసుకొస్తామని, హామీ ఇచ్చారు. కార్యదర్శి బుల్లెయ్య మాట్లాడుతూ ఫెడరేషన్ లో తనకు సముచిత స్థానం కల్పించి బాధ్యతలు అప్పగించారని, తనను ఎన్నుకున్న ఫెడరేషన్ నాయకులకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కమిటీలో, ఉపాధ్యక్షులు గా కరేటి సాంబశివరావు, సహాయ కార్యదర్సులుగా దాసరి వెంకటేశ్వర రావు, యల్లమాటి రామకృష్ణ బాపనయ్య లు ఉన్నారు. కార్యక్రమం లోయల్లమాటి రాంబాబు, గుమ్మడి ప్రకాశరావు ,దాసరికిరణ్ ,సోమేశ్వరరావు , ఎస్. ఎస్. జహీర్, ఎస్.ఎస్. వి. శేఖర్, చందు, ప్రవీణ్, నాయుడు, శ్రీనివాస్, డి.కోటేశ్వరరావు , యూ కోటేశ్వరరావు, పి. పున్నయ్య, తదితరులు పాల్గొన్నారు