Skip to main content

భవిష్యత్‌ మీద ఆశ కలిగించాలి

భవిష్యత్‌ మీద ఆశ కలిగించాలి
- ఐఏఎన్‌ఎల్‌పీ ప్రెసిడెంట్‌ విశేష్‌
- విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన మూడు రోజుల వర్క్‌షాప్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు అధ్యాపకులుగా, కౌన్సిలర్లుగా వారికి భవిష్యత్‌ మీద ఆశ కలిగించాలని ఐఏఎన్‌ఎల్‌పీ ( ఇంటర్నేషనల్‌ న్యూరో లింగ్విస్టిక్‌ ప్రోగ్రామ్‌) ప్రెసిడెంట్‌ విశేష్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని సోషల్‌ సైన్సెస్‌ అండ్‌ హుమానిటీస్, అకాడమీ ఫర్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, ఐక్యూఏసీ, ఏపీఏ ఇండియాల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఎంపవరింగ్‌ త్రూ ప్రివెన్షన్‌ – ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ ఆన్‌ లైఫ్‌–సేవింగ్‌ ఎడ్యుకేషన్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు అధ్యాపకులకు, కౌన్సిలర్‌లకు నిర్వహించే  వర్క్‌షాప్‌ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఎన్‌ఎల్‌పీ ప్రెసిడెంట్‌ విశేష్‌ మాట్లాడుతూ అధ్యాపకులుగా మీరందరూ విద్యార్థులను ఎప్పుడు కూడా సరికొత్తగా ఆలోచించే విధంగా  ప్రోత్సహించాలన్నారు. అలా చేయనట్లైతే మెదడు చెడు ఆలోచనలవైపు దృష్టిమరలుతుందన్నారు. తరగతిగదిలో ఉపాధ్యాయుడు లీడర్‌గా మారి తన ఫిలాసఫీని, తన ఆదర్శాలను విద్యార్థుల ముందుంచి వారిని గొప్ప ఆవిష్కర్తలుగా తయారుచేయాలని సూచించారు. తరగతిగదిలో పాఠ్యాంశాలను బోధించేటప్పుడు అధికార గర్వం కన్నా ప్రజాస్వామిక దృక్పథం ప్రధానమన్నారు. ఉపాధ్యాయుడు అనే భావనకు బదులుగా తరగతిగదిలో తాను భాగస్వామిననే భావన కలిగి ఉండాలని పేర్కొన్నారు. తరగతిగదిలో ఉన్న విద్యార్థి మెరుగుపడటంతో పాటు.. తాను కూడా వారితో పాటు మెరుగుపడుతున్నాననే భావనతో పనిచేస్తే ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందుతారన్నారు. తనకంటే గొప్పవారిగా తన విద్యార్థులను తయారుచేయాలనే కోరిక ప్రతి ఉపాధ్యాయునిలో తప్పనిసరిగా ఉండాలన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన జీవీఏ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైకాలజీ ఫౌండర్, క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ గోగి మాట్లాడుతూ అధ్యాపకులు విద్యార్థుల సమస్యలను గుర్తించడంతో పాటు వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని సునిశితంగా పరిష్కరించాలన్నారు. జీవితంలో ప్రతి విద్యార్థి కూడా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అటువంటి సందర్భాలలో విద్యార్థులు ఆందోళన చెంది, ఒత్తిడికి గురై సమస్యలను పరిష్కరించలేమనే నిరాశకు గురికాకుండా పరిష్కారానికి గల అనువైన పద్ధతులను వెతికేలా ట్రైనింగ్‌ ఇవ్వాలన్నారు. విద్యార్థులు ధైర్యంతో ముందుకు సాగితే జీవితంలో ఏదైనా సాధించగలరని నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు. విద్యార్థుల ఎదుగదలలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో ఏపీఏఐ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ క్రిష్ణ భరత్, నేషనల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జీ.రాజేశ్వరరావు, నేషనల్‌ సెక్రటరీ రవిభార్గవ్, ఏపీఏఐ ఏపీ కమిటీ ప్రెసిడెంట్‌ ఎమ్‌పీ జానకిరామ్, వైస్‌ ప్రెసిడెంట్‌ పీవీవీ ప్రసాద్, ట్రెజరర్‌ అత్తోట తేజ, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...