ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 చుండూరు జనవరి5 కుల మతాలకు పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా గుర్తించి ప్రతి నెలవాలంటీర్ల ద్వారా అవ్వ తాతలకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందించే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబుఅన్నారు 2750 పెన్షన్ను పెంపు  ద్వారా 3000 రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రారంభించారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వ ఆయాయంలో పెన్షన్ల కోసం రోజుల తరబడి కార్యాలయాలు చుట్టూజన్మభూమి కమిటీల చుట్టూతిరిగే వారన్నారుముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో అర్హత ఉన్న ప్రతి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు ఇటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు అండగా ఉండాలన్నారుఈ సందర్భంగా గతంలో 7549 పెన్షన్  లు ఉండగాకొత్త 202పెన్షన్లను  కలపి7751పంపిణీ చేశారు  ఈకార్యక్రమంలోఎంపీపిజాలాదిరూబెన్  గ్రామ సర్పంచ్ ఉయ్యూరు అప్పి రెడ్డి ఎంపీడీవో  టి సుగుణవైసిపి నాయకులు వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు