చుండూరు జనవరి5 కుల మతాలకు పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా గుర్తించి ప్రతి నెలవాలంటీర్ల ద్వారా అవ్వ తాతలకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందించే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబుఅన్నారు 2750 పెన్షన్ను పెంపు ద్వారా 3000 రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రారంభించారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వ ఆయాయంలో పెన్షన్ల కోసం రోజుల తరబడి కార్యాలయాలు చుట్టూజన్మభూమి కమిటీల చుట్టూతిరిగే వారన్నారుముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో అర్హత ఉన్న ప్రతి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు ఇటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు అండగా ఉండాలన్నారుఈ సందర్భంగా గతంలో 7549 పెన్షన్ లు ఉండగాకొత్త 202పెన్షన్లను కలపి7751పంపిణీ చేశారు ఈకార్యక్రమంలోఎంపీపిజాలాదిరూబెన్ గ్రామ సర్పంచ్ ఉయ్యూరు అప్పి రెడ్డి ఎంపీడీవో టి సుగుణవైసిపి నాయకులు వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
విజ్ఞాన్స్లో ‘‘డార్లింగ్’’ సినిమా యూనిట్ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్’’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్, దర్శకుడు అశ్విన్ రామ్, ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్ ’’ సినిమాను నిర్మించారు. సినిమాలో హీరోయిన్గా నభా నటేష్ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు. ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....