విశాలాంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఏఐటీయూసీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం

విశాలాంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఏఐటీయూసీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
నిజాన్ని నిర్భయంగా ప్రచురిస్తూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో విశాలాంధ్ర దినపత్రిక ముందుంటుందని ఏఐటీయూసీ   గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం అన్నారు స్థానిక సిపిఐ  పార్టీ కార్యాలయంలో ఆదివారం విశాలాంధ్ర 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. జిల్లా నాయకులు బొల్లి ముంత కృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పలువురికి ఉపాధి కల్పిస్తూ సుదీర్ఘ చరిత్ర కలిగిన పత్రిక విశాలాంధ్ర అన్నారు పత్రికతో పాటు తక్కువ ధరకు ప్రత్యేక పుస్తకాలను ముద్రించి ప్రజలకు అందించడం సంతోషకరమన్నారు విశాలాంధ్ర దినపత్రిక దినదినాభివృద్ధి   చెందాలని ఆకాంక్షిస్తూ పత్రిక యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసి తెనాలి నియోజవర్గ సెక్రటరీ  మునిపల్లి శ్రీకాంత్, బి వెంకట్, అనపర్తి వెంకటేశ్వరరావు, సుభాష్ చంద్రబోస్, విజయలక్ష్మి, విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు