విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అంబవరం ప్రతాప్‌రెడ్డి అనే విద్యార్థికి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇన్వెస్టిగేషన్‌ ఆన్‌ బాండ్‌విడ్త్‌ అండ్‌ గేన్‌ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ ఆఫ్‌ మైక్రోస్ట్రిప్‌ ప్యాచ్‌ యాంటినా ఫర్‌ వైమ్యాక్స్‌–5జీ–డబ్యూలాన్‌ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎమ్‌.పచియానన్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. పీహెచ్‌డీ పట్టా పొందిన అంబవరం ప్రతాప్‌రెడ్డిని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.