కాంగ్రెస్ పార్టీలోకి గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ కైతేపల్లి

కాంగ్రెస్ పార్టీలోకి గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ కైతేపల్లి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 వేమురు నియోజకవర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ కై తేపల్లి షాలెం రాజు శనివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ సభ్యులు జెడి శీలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటఅంజి బాబు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ తాడికొండ వెంకటేశ్వరరావు ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలోని పల్లె కోన గ్రామానికి చెందిన షాలెం రాజు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మంత్రి మెరుగు నాగార్జున సన్నిహితంగా మెలిగేవారు. గత కొంతకాలం నుంచి మెరుగు నాగార్జున కు దూరంగా ఉంటూ గ్రేస్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ గ్రామాల్లో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే రీతిలో వేమూరు నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కూడా ఆశించారు. నియోజకవర్గంలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన షాలెం రాజు గత నాలుగైదు ఏళ్లగా  నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అభ్యర్థిత్వం కోసం  తీవ్ర ప్రయత్నాలు చేశారు. అధిష్టాన వర్గం పార్టీ టికెట్  మరొకరికి కేటాయించడంతో మనస్థాపానికి  గురైనట్లు తెలిసింది, తను నియోజకవర్గ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నైనా పోటీ చేస్తానని ప్రకటించిన షాలెం రాజు కాంగ్రెస్ పార్టీలోకి వైయస్ షర్మిల రాక తో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు విలేకరులకు తెలియజేశారు. అందులో భాగంగానే తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. ఇకనుంచి వేమూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో పని చేస్తానని తెలిపారు