Skip to main content

ఈ నెల 6 నుంచి విజ‌య‌వాడ‌లో భార‌త్ రంగస్థల మ‌హోత్స‌వ్‌

ఈ నెల 6 నుంచి విజ‌య‌వాడ‌లో భార‌త్ రంగస్థల మ‌హోత్స‌వ్‌
- 11వ తేదీ వ‌ర‌కు తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో నాట‌కాల ప్ర‌ద‌ర్శ‌న‌
- నాట‌క‌రంగ ప్రేక్ష‌కులు, క‌ళాకారులు స‌ద్వినియోగం చేసుకోవాలి
- ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వ‌ర‌కు విజ‌య‌వాడ‌లో 23వ‌ భార‌త్ రంగస్థల మ‌హోత్స‌వ్‌-ఇంటర్నేష‌న‌ల్ థియేట‌ర్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా-2024 కింద నాట‌కాల ప్ర‌ద‌ర్శ‌న జ‌ర‌గ‌నుంద‌ని.. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.
శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు రేగుళ్ల మ‌ల్లికార్జున‌రావు, జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, డిప్యూటీ క‌లెక్ట‌ర్ కిర‌ణ్మ‌యి త‌దిత‌రుల‌తో క‌లిసి భార‌త్ రంగ‌స్థ‌ల మ‌హోత్స‌వ్‌ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ రంగ‌స్థ‌ల కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హించేందుకు నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) దేశ విదేశాల నుంచి 100 నాట‌కాల‌ను ఎంపిక‌చేసి దేశ వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల్లో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 21 వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేస్తోంద‌న్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ నెల 6 నుంచి 11 వ‌ర‌కు విజ‌య‌వాడ‌, తుమ్మ‌ల‌ప‌ల్లి వారి క్షేత్ర‌య్య క‌ళాక్షేత్రంలో నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉంటాయ‌ని వివ‌రించారు. ప్ర‌తిరోజు సాయంత్రం 6 గంట‌ల నుంచి నాట‌క ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌ని.. ఈ అవ‌కాశాన్ని నాట‌క‌రంగ ప్రేక్ష‌కులు, క‌ళాకారులు వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు కోరారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు ఆర్‌.మ‌ల్లికార్జున‌రావు మాట్లాడుతూ ఫిబ్ర‌వ‌రి 6వ తేదీన మై రి మె కా సె క‌హు, 7న గ‌దాయుద్ధ , 8న ఎండ్ గేమ్, 9న ఖోనా, 10న క‌హాన్ క‌బీర్, 11వ తేదీన అయోధ్య కాండ నాట‌కాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌ని తెలిపారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...