విజ్ఞాన్స్ విద్యార్థికి పీహెచ్డీ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ – కోర్ ఇంజినీరింగ్ విభాగంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ విభాగానికి చెందిన గరిగిపాటి ఫృథ్వి రాజు అనే విద్యార్థికి విజ్ఞాన్స్ యూనివర్సిటీ శుక్రవారం పీహెచ్డీ పట్టా అందజేసిందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ప్రిపరేషన్, క్యారక్టరైజేషన్ అండ్ కంపుటేషనల్ మెషినింగ్ స్టడీస్ ఆన్ అల్యూమినియం సిలికాన్ 7– సిలికాన్ కార్భైడ్ కాంపోసైట్’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ మెకానికల్ విభాగానికి చెందిన మాజీ ప్రొఫెసర్ కే.బాలమురుగన్ గైడ్గా వ్యవహరించారని పేర్కొన్నారు. పీహెచ్డీ పట్టా పొందిన గరిగిపాటి ఫృథ్వి రాజును ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.