Skip to main content

కామోత్సవ దహనం పుస్తకావిష్కరణ


కామోత్సవ దహనం పుస్తకావిష్కరణ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఏ రూపంలో అశ్లీలత ఉన్నా దాన్ని తీవ్రంగా ప్రతిఘటించవలసిన అవసరం ఉందని అశ్లీలతా ప్రతిఘటన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ప్రజాసాహితి పత్రిక సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు అన్నారు. అభ్యుదయ రచయితల సంఘం, అశ్లీలతా ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని సి.పి.ఐ. కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో అశ్లీలతా ప్రతిఘటన వేదిక వ్యవస్థాపకుడు ఈదర గోపీచంద్ సంపాదకత్వంలో వెలువడిన కామోత్సవ దహనం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి అనంతరం జరిగిన సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. రవిబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 1987 ప్రాంతంలో ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించగా ఒక వారపత్రికలో ధారావాహికగా వచ్చిన కామోత్సవ్ అనే అశ్లీల రచనను ప్రతిఘటిస్తూ వ్యాసాలు రాసినందుకు తమపై కేసులు నమోదు చేసినప్పటికీ అవి వీగిపోయాయని రవిబాబు అన్నారు. ఈదర గోపీచంద్ మాట్లాడుతూ అప్పట్లో ధారావాహికగా వచ్చిన ఈ రచనను గుంటూరు శేషేంద్రశర్మ తనయుడు ప్రస్తుతం నవల రూపంలో అందుబాటులో తెచ్చారని ఆ కారణంగా అందులో ఉన్న అశ్లీలతను నేటి తరం వారికి తెలియజెప్పాలని అప్పట్లో ఈ రచనను వ్యతిరేకిస్తూ వచ్చిన వ్యాసాలు, దినపత్రికలలోని ప్రచురితమైన పలు అంశాలను క్రోడీకరించి కామోత్సవ దహనం పేరుతో పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 26 అశ్లీలతా ప్రతిఘనట వేదిక ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు ఈదర గోపీచంద్ తెలిపారు. అశ్లీల ప్రతిఘనట వేదిక రాష్ట్ర కార్యదర్శి బీరం సుందరరావు మాట్లాడుతూ నేడు సెల్ఫోన్లలో వస్తున్న అశ్లీల చిత్రాలు యువతను పెడత్రోవ పట్టిస్తున్నాయని, వాటిని ప్రతిఘటించవలసిన అవసరం ఉందన్నారు. సభలో అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగా, విశ్రాంత ప్రొఫెసర్ బి. లలితానంద ప్రసాద్, ఏఐటియుసి సీనియర్ నేత పరుచూరి వెంకటేశ్వరరావు, రచయితలు కె. నారాయణమూర్తి, ఐనాల మల్లేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
55

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...