Skip to main content

యువత నాటకరంగం లో రాణించాలని

యువత నాటకరంగం లో రాణించాలని 
 - సినీ రచయిత బుర్రా సాయి మాధవ్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
అనేక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి కానీ నాటకరంగం అభివృద్ధి చెందడం లేదని, అందుకే నాటక కుటుంబం నుండి వచ్చిన తాను నాటక రంగంపై అభిమానంతో తనకు చేతనైనంత వరకు నాటకరంగానికి తోడ్పడుతున్నానని ప్రముఖ సినీ రచయిత  బుర్రా సాయి మాధవ్ అన్నారు. ప్రముఖ నాటక,సినీ నటి, రచయిత్రి, దర్శకురాలు డా. శ్రీజ సాదినేని రచించిన " త్రినయని " మూడు విభిన్న నాటికలు పుస్తక ఆవిష్కరణ మంగళవారం ఫిల్మ్ నగర్ లో జరిగింది.  సాయి మాధవ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డా.శ్రీజకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత నాటక రంగం లోకి రావాలి, రాణించాలని కోరారు. ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేస్తూ ఈ సంవత్సరం సాంఘిక పద్య నాటకాలను పరిచయం చేయబోతున్నామని చెప్పారు. శ్రీజ సాదినేని లాగే మరెందరో నటులు, రచయితలు తమ ప్రతిభకు సాన పెట్టుకున్నట్లు అవుతుంది, అందుకు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా మంచి సందర్భం అని డా.శ్రీజ సాదినేనికి అభినందనలు తెలిపారు.ఎంతో ప్రతిభ కలిగిన డా.శ్రీజ కేవలం నాటక రంగంలో మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో కూడా చక్కని నటిగా, మంచి రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆయన ఆశీస్సులు అందించారు. డా.శ్రీజ సాదినేని మాట్లాడుతూ ప్రముఖ నాటక సినీ రచయిత  సాయి మాధవ్ గారు నాటక రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని, వారి చేతుల మీదుగా తన త్రినయని పుస్తక ఆవిష్కరణ జరగడం శుభ దాయకం అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాయి మాధవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు డా.శ్రీజ సాదినేనికి అభినందనలు తెలిపారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...