Skip to main content

ఆంధ్రలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నావంతు కృషి చేస్తా _ఎ. యమ్.రత్నం

ఆంధ్రలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నావంతు కృషి చేస్తా
-ఎ. యమ్.రత్నం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్, డూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఎ.యమ్.రత్నం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా.. ఆయన నెల్లూరు జిల్లా వాసి కావడంతో ఆ జిల్లాకు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, కళాకారులు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సభ్యులకు, ఆయనకు ఘన సన్మానం చేసి చిత్ర పరిశ్రమలో ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.
ఎ. యమ్.రత్నం మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో నేను జన్మించినందుకు అదృష్టంగా భావిస్తున్నానని , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.. 
ఛాంబర్ కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో నెల్లూరు జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని , నెల్లూరు జిల్లా నుంచి పేరు మోసిన కళాకారులు, నిర్మాతలు, దర్శకులు ఎందరో ఉన్నారని , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అందరం కలిసి కట్టుగా పని చేయాలని పిలుపు నిచ్చారు.. ఛాంబర్ తరుపున వర్క్ షాప్ లు నిర్వహించి నిర్మాతలలో ప్రొడక్షన్ పట్ల అవగాహన, టెక్నీషియన్స్ లో స్కిల్ డెవలప్మెంట్ కు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రలో విజయవాడ, తిరుపతి లో కూడా పూర్తి స్థాయి ఔట్ డోర్ యూనిట్స్ ఏర్పాటుకు ఛాంబర్ తరుపున ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.. ప్రభుత్వ రాయితీలను నిర్మాతల దృష్టికి తీసికెళ్ళి రాష్ట్రం లోనే షూటింగ్ లు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.. ఇంకా కార్యక్రమంలో ఛాంబర్ ట్రెజరర్ యం.శ్రీనాధ రావు, వైస్ ప్రెసిడెంట్ మంతా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ పి. రమణా రెడ్డి, ఇ సి 
 మెంబర్లు పి డి ఆర్ప్రసాద్ రెడ్డి, మిత్తాన ఈశ్వర్ రావు, ఛాంబర్ మాజీ ఇ సి మెంబర్ డిస్ట్రిబ్యూటర్ డి.ప్రభాకర్ రావు పాల్గొన్నారు..

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...