Skip to main content

జర్నలిస్టుల ఇళ్లస్థలాల జి.ఓ ను అమలు చేయాలి

జర్నలిస్టుల ఇళ్లస్థలాల జి.ఓ ను అమలు చేయాలి.
_ ఇళ్ల పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలి.
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కు వినతి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా జర్నలిస్టులకు ఇళ్లస్థలాల మంజూరు అంశం పై సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం లో డి. టీ  సుధా కిరణ్మయికు ఏపీడబ్ల్యూజేఎఫ్  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో ఫెడరేషన్ సభ్యులు
వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో  జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటిస్థలం కేటాయింపు వెంటనే జరిగేందుకు వీలైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 జిల్లాలో కమిటీలు ఇప్పటికే జాబితాలను తయారు చేశారని తరువాత ఫిబ్రవరిలో మరోవారం రోజులు దరఖాస్తుకు అవకాశం కల్పించడం ద్వారా మరికొంతరు జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసే అవకాశం కల్పించారన్నారు. వీలైనంత త్వరగా తుది జాబితాను తయారు చేయాలని వెంటనే ఆ జాబితా విడుదల చేయాలని కోరారు. జాబితాలోని జర్నలిస్టులకు ఆయా మండలాల్లో, జిల్లా కేంద్రంలో ఎంతభూమి అవసరమో అంచనాలు తయారుచేసి అందుబాటులో ఉన్న భూమి వివరాలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భూమి అందుబాటు ఉన్న ప్రాంతాల్లో ధర నిర్ణయం జరిగి జర్నలిస్టులు ఎంతమొత్తం,ఎప్పటిలోగా చెల్లించాలో కమిటీలు నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా జర్నలిస్టులు సంసిద్ధులవుతారని ఆర్థికంగా బలహీనస్థితిలో ఉన్నవారం కనుక తగినంత సమయం ఇస్తే బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీ. ఓ. అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  అనంతరం డి.ఎస్.పి. ఎం. రమేష్ ను కలసి జర్నలిస్టుల పై దాడులు జరగకుండా చూడాలని. హోమ్ మంత్రి ఆధ్వర్యం లో మీడియా హై పవర్ కమిటీ వేయాలని వినతి పత్రంఅందజేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఎస్.ఎస్. జహీర్,బచ్చు సురేష్ బాబు, ఎం. సుబ్బారావు,
 పి. పున్నయ్య, అంబటి శ్యామ్ సాగర్, బి. చంద్ర మోహన్, సీ.హెచ్ చంద్ర శేఖర్, యూ. షణ్ముఖేశ్వర రావు, జి. ప్రకాశరావు, డి. నాగరాజు. ఎ. సాంబ శివరావు, కరేటి సాంబశివ రావు,సభ్యులు ఉన్నం భూషణం, శ్రీనివాస్, వి. లక్ష్మణరావు, వి. నాయుడు, ఎ. సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...