తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంటపురం ఆధ్వర్యంలో విద్యార్థులకు సాయం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంటపురం ఆధ్వర్యంలో 
 బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పదవ తరగతి పరీక్షలకు వెళుతున్న 102 మంది విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు, స్కేల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు పావులూరు రాంబాబు అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఈదర వెంకట పూర్ణ చంద్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఈదర శ్రీనివాసరావు , డి .మురళీకృష్ణ, గుమ్మడి వెంకటనారాయణ, కాకుమాను ఉపేంద్ర ,జాన్ కిడ్స్ సుబ్రహ్మణ్యం, స్కూలు ప్రధాన ఉపాధ్యాయుడు రొటీరియన్ కుర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.