టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:జాతీయ ఒలంపియాడ్లో నెహ్రూనికేతను రాష్ట్ర ర్యాంక్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
జాతీయ ఒలంపియాడ్లో నెహ్రూనికేతన్ రాష్ట్ర ర్యాంక్
తెనాలి: 12-03-2024: న్యూఢిల్లీకి చెందిన సిల్వరోన్ ఫౌండేషన్వారు గతేడాది డిసెంబర్లో నిర్వహించిన జాతీయ గణిత ఒలంపియాడ్లో స్థానిక బోస్ రోడ్ లోని
 నెహ్రూ నికేతన్ చెందిన బాలబాలికలు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. దాసరి శెర్మిష్ట్రా (179వ ర్యాంక్), ఎన్. కరుణశ్రీ (305వ ర్యాంక్), సి.హెచ్. ఈశ్వర్ బాబు (321), కె. సహస్రద్యుతి (340వ ర్యాంక్), సి.హెచ్. జయశ్రీనివాస్ (403వ ర్యాంక్), కాజా తరుణి (467వ ర్యాంక్) సాధించారు. సిల్వరోన్ ఫౌండేషన్వారు న్యూఢిల్లీ నుండి పంపిన ధ్రువపత్రాలతో పాటు బంగారు, రజత, కాంస్య పతకాలను నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మంగళవారం పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో విజేతలకు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.