ఎ.పి. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బాపట్ల నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎ.పి. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బాపట్ల నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: అంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బాపట్ల నియోజక వర్గ నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం ఉదయం స్థానిక ఎన్. జీ. ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో  బాపట్ల నియోజకర్గ అధ్యక్షునిగా గుమ్మడి ప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి గా దేవరపల్లి నాగరాజు లను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాలు కొనసాగుతుందని రత్నాకర్ చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని, ఫెడరేషన్ అభివృద్ధి కోసం పాటుపడతామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. ఎన్నికను ఫెడరేషన్ నాయకులు
యూ. షణ్ముఖేశ్వర రావు పర్యవేక్షించారు. కార్యక్రమం లో ఫెడరేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.