అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డుకు ఎంపికైన శ్యామ్ సాగర్

అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డుకు ఎంపికైన శ్యామ్ సాగర్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: 
భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకును ప్రతి ఏడాది టాలెంట్ ఎక్స్ప్రెస్ సంస్థ అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డును ప్రదానం చేస్తుంది. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డును పట్టణానికి చెందిన జర్నలిస్ట్ అంబటి శ్యామ్ సాగర్కు అందజేస్తునట్లు దర్శకుడు కనపర్తి రత్నాకర్ తెలిపారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని జైభీమ్ అంబేద్కర్ ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం 4గంటలకు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న సభ నాగార్జున విశ్వవిద్యాలయం అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ అధ్యక్షతన నిర్వహిస్తునట్లు తెలిపారు. టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, టివి 7 న్యూస్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని నిర్వహకులు ఎం. శ్రీకాంత్, పుట్ట పున్నయ్యలు చెప్పారు.