Skip to main content

అంబేద్కర్ ఎక్స్ లేన్సి అవార్డ్ అందుకున్న శ్యామ్ సాగర్

అంబేద్కర్ ఎక్స్ లేన్సి అవార్డ్ అందుకున్న శ్యామ్ సాగర్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
భారత రత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి స్థానిక అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయం లో శనివారం సాయంత్రం ఘనం గా జరిగింది. కార్యక్రమం లో భాగం గా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్ లెన్సీ పురస్కారాన్ని జర్నలిస్ట్ అంబటి శ్యామ్ సాగర్ కు ప్రదానం చేసారు.
పట్టణానికి చెందిన టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, టివి 7 న్యూస్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి పురస్కారం అందిస్తున్న నేపథ్యంలో పత్రికా రంగానికి సంబంధించి జర్నలిస్ట్ శ్యామ్ సాగర్ ను ఎంపికచేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయం అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.అబ్రహాంలింకన్ అధ్యక్షతన నిర్వహించిన సభలో శ్యామ్ సాగర్ పురస్కారాన్ని అందించారు. షీల్డు బహూకరించి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్రహాం లింకన్ మాట్లాడుతూ సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. శ్యామ్ సాగర్ కు అంబేద్కర్ 
 పురస్కారంతో సత్కరించటం అభినందనీమన్నారు. దిబుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి యండ్రపాటి అశోక్ కుమార్, ఎసిసిఆర్పిఎస్ ఆల్ ఇండియా సెక్రటరీ అందేశ్యామ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధి వంటివారని, వారిని ఇలాంటి అరుదైన పురస్కారాలతో సత్కరించుకోవటం ఎంతో సంతోషమన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు కె. రత్నాకర్, ఎం.శ్రీకాంత్, పి. పున్నయ్య, ఏఐటియూజీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం, కె. డేవిడ్, బాబురావు లతో పాటు జర్నలిస్టులు గుమ్మడి ప్రకాశరావు, మేకల సుబ్బారావు,  చంద్ర మోహన్, చందు, ప్రవీణ్, సి.హెచ్ శేఖర్, ఎన్. జె శ్యామ్యూల్, సంజయ్, రవికిరణ్, ఉన్నం భూషణం తదితరులు పాల్గొన్నారు.
 

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...