అంబేద్కర్ ఎక్స్ లేన్సి అవార్డ్ అందుకున్న శ్యామ్ సాగర్

అంబేద్కర్ ఎక్స్ లేన్సి అవార్డ్ అందుకున్న శ్యామ్ సాగర్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
భారత రత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి స్థానిక అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయం లో శనివారం సాయంత్రం ఘనం గా జరిగింది. కార్యక్రమం లో భాగం గా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్ లెన్సీ పురస్కారాన్ని జర్నలిస్ట్ అంబటి శ్యామ్ సాగర్ కు ప్రదానం చేసారు.
పట్టణానికి చెందిన టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, టివి 7 న్యూస్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి పురస్కారం అందిస్తున్న నేపథ్యంలో పత్రికా రంగానికి సంబంధించి జర్నలిస్ట్ శ్యామ్ సాగర్ ను ఎంపికచేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయం అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.అబ్రహాంలింకన్ అధ్యక్షతన నిర్వహించిన సభలో శ్యామ్ సాగర్ పురస్కారాన్ని అందించారు. షీల్డు బహూకరించి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్రహాం లింకన్ మాట్లాడుతూ సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. శ్యామ్ సాగర్ కు అంబేద్కర్ 
 పురస్కారంతో సత్కరించటం అభినందనీమన్నారు. దిబుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి యండ్రపాటి అశోక్ కుమార్, ఎసిసిఆర్పిఎస్ ఆల్ ఇండియా సెక్రటరీ అందేశ్యామ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధి వంటివారని, వారిని ఇలాంటి అరుదైన పురస్కారాలతో సత్కరించుకోవటం ఎంతో సంతోషమన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు కె. రత్నాకర్, ఎం.శ్రీకాంత్, పి. పున్నయ్య, ఏఐటియూజీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం, కె. డేవిడ్, బాబురావు లతో పాటు జర్నలిస్టులు గుమ్మడి ప్రకాశరావు, మేకల సుబ్బారావు,  చంద్ర మోహన్, చందు, ప్రవీణ్, సి.హెచ్ శేఖర్, ఎన్. జె శ్యామ్యూల్, సంజయ్, రవికిరణ్, ఉన్నం భూషణం తదితరులు పాల్గొన్నారు.