రోబోటిక్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం


రోబోటిక్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 30-04-2024: స్థానిక బోస్ రోడ్డులోని నెహ్రూనికేతన్ హైస్కూల్లో ఇటీవల రోబోటిక్ వైజ్ఞానిక పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విజేతలకు మంగళవారం ఉదయం మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లల మేధస్సుకు పదును పెట్టెందుకు రోబోటిక్లను రూపొందించడం, దానికి కోడింగ్ ఇచ్చే విధానం, రోబో ఎలా పనిచేస్తుంది? కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశాలు ఇత్యాది పలు అంశాలలో పోటీలు నిర్వహంచి విజేతలకు బహుమతులు అందించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన రోబోటిక్ టెక్నాలజీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి. నాగ వెంకట సాయిరాం, సాజీద్ షేక్, బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.